సెన్సెక్స్ 50 పాయింట్లు డౌన్
ABN, Publish Date - Jan 09 , 2025 | 01:34 AM
ఈక్విటీ సూచీలు బుధవారం స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ఒకదశలో 712 పాయింట్ల మేర క్షీణించిన సెన్సెక్స్.. చివరికి 50.62 పాయింట్ల నష్టంతో 78,148.49 వద్ద స్థిరపడింది...
ముంబై: ఈక్విటీ సూచీలు బుధవారం స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ఒకదశలో 712 పాయింట్ల మేర క్షీణించిన సెన్సెక్స్.. చివరికి 50.62 పాయింట్ల నష్టంతో 78,148.49 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 18.95 పాయింట్లు కోల్పోయి 23,688.95 వద్ద క్లోజైంది. కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరం జీడీపీ వృద్ధి రేటు అంచనాలను నాలుగేళ్ల కనిష్ఠ స్థాయి 6.4 శాతానికి తగ్గించడంతోపాటు డిసెంబరు త్రైమాసిక ఆర్థిక ఫలితాల సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో మదుపరులు అప్రమత్తమై అమ్మకాలకు పాల్పడ్డారు.
Updated Date - Jan 09 , 2025 | 01:38 AM