ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

క్రీడా‘రాణులు’

ABN, Publish Date - Mar 07 , 2025 | 11:51 PM

అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని నగరంలోని రాజీవ్‌క్రీడా ప్రాంగణంలో శుక్రవారం మహిళా ఉద్యోగులకు ఆటల పోటీలు నిర్వహించారు.

కబడ్డీ పోటీలు..

- ఆటపాటలతో సందడి చేసిన ఉద్యోగినులు

- అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని నిర్వహణ

- స్త్రీలు అన్ని రంగాల్లో రాణించాలన్న ఆర్డీవో కీర్తి

విజయనగరం, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని నగరంలోని రాజీవ్‌క్రీడా ప్రాంగణంలో శుక్రవారం మహిళా ఉద్యోగులకు ఆటల పోటీలు నిర్వహించారు. ఏపీ ఎన్జీవో జిల్లా మహిళా విభాగం ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీల్లో మహిళా ఉద్యోగులు పాల్గొని సందడి చేశారు. ముఖ్య అతిథిగా ఆర్డీవో డి.కీర్తి హాజరయ్యారు. జెండా ఊపి క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని అన్నారు. మహిళలు ఒకపక్క ఉద్యోగాలు చేస్తూ.. మరో గృహిణిగా బాధ్యతలు నిర్వహిస్తూ ఉంటారని తెలిపారు. ఈ సందర్భంగా మహిళా ఉద్యోగులు కబడ్డీ, ఖోఖో, టెన్నికాయిట్‌, షటిల్‌ బ్యాడ్మింటన్‌, మ్యూజికల్‌ చైర్స్‌ వంటి క్రీడలు ఆడారు. కార్యక్రమంలో ఏపీఎన్జీవో ప్రతినిఽధులు డీవీ రమణ, శ్రీధర్‌బాబు, సురేష్‌, కిషోర్‌, ఆనందకుమార్‌, మహిళా విభాగం ప్రతినిధులు ఆదిలక్ష్మి, స్వప్న, రాధిక, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 07 , 2025 | 11:51 PM