విద్యార్థులను మోకాళ్లపై నిల్చోబెట్టి..!
ABN, Publish Date - Jan 23 , 2025 | 12:01 AM
Keeping the students on their knees..! అర్తమూరు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల పట్ల పాఠశాల ఉపాధ్యాయుడు ప్రవర్తించిన తీరు విమర్శలకు తావిచ్చింది. హోం వర్కును చేయనందుకు ఓ ఉపాధ్యాయుడు బుధవారం గంటలకొద్దీ పాఠశాల బయట ఎండలో మోకాళ్లపై నిల్చోబెట్టారు.
విద్యార్థులను మోకాళ్లపై నిల్చోబెట్టి..!
ఉపాధ్యాయుడిని నిలదీసిన స్థానికులు
గరివిడి, జనవరి 22(ఆంధ్రజ్యోతి): అర్తమూరు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల పట్ల పాఠశాల ఉపాధ్యాయుడు ప్రవర్తించిన తీరు విమర్శలకు తావిచ్చింది. హోం వర్కును చేయనందుకు ఓ ఉపాధ్యాయుడు బుధవారం గంటలకొద్దీ పాఠశాల బయట ఎండలో మోకాళ్లపై నిల్చోబెట్టారు. దీన్ని గమనించిన స్థానికులు ఉపాధ్యాయుడుని ప్రశ్నించారు. మందలించే తీరు పద్ధతిగా ఉండాలన్నారు. ఈ విషయమై వారి మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. విద్యార్థినులు మోకాళ్లమీద కూర్చోడానికి చాలా ఇబ్బంది పడ్డారు. విషయాన్ని ఎంఈవో పి.రామారావు వద్ద ప్రస్తావించగా తన దృష్టికి వచ్చిందని, భవిష్యత్తులో మళ్లీ ఇలా ప్రవర్తిస్తే కఠినచర్యలు తప్పవని ఉపాధ్యాయుడిని హెచ్చరించానని తెలిపారు.
Updated Date - Jan 23 , 2025 | 12:01 AM