అర్జీలకు తక్షణ పరిష్కారం
ABN, Publish Date - Feb 09 , 2025 | 12:03 AM
ప్రజా దర్బార్ అందిన అర్జీలను పోర్టల్లో నమోదు చేస్తామని చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు తెలిపారు. వాటికి తక్షణమే పరి ష్కారం చూపించడం కోసం సంబంధిత అధికా రులతో మాట్లాడుతున్నామని చెప్పారు.
చీపురుపల్లి, ఫిబ్రవరి 8(ఆంధ్రజ్యోతి): ప్రజా దర్బార్ అందిన అర్జీలను పోర్టల్లో నమోదు చేస్తామని చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు తెలిపారు. వాటికి తక్షణమే పరి ష్కారం చూపించడం కోసం సంబంధిత అధికా రులతో మాట్లాడుతున్నామని చెప్పారు. శనివా రం చీపురుపల్లిలోని టీడీపీ కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూప్రజల సమస్యలు పరిష్కారమే ప్రజాదర్బార్ లక్ష్యమని తెలిపారు.నెలలో రెండో శనివారం ఈ కార్యక్రమం నిర్వహించాల్సిందిగా ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు. అనంతరం కనకమహాలక్ష్మి అమ్మవారి జాతర పోస్టర్లను ఆవిష్కరించారు. మార్చి 2,3,4 తేదీల్లో జరిగే అమ్మవారి జాతరను స్థానికులు, ప్రజాప్ర తినిధులు, అధికారుల సహకారంతో విజయ వంతం చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు రౌతు కామునాయుడు, దన్నాన రామచంద్రుడు, పైల బలరాం, ముల్లు రమణ, జనసేన ఇన్చార్జి విసినిగిరి శ్రీనివా సరావు, రెడ్డి గోవింద్, వెన్నె సన్యాసినాయుడు పాల్గొన్నారు.
Updated Date - Feb 09 , 2025 | 12:03 AM