ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

హైవే నిర్మాణంతో పురాతన వంతెనలకు మోక్షం

ABN, Publish Date - Mar 11 , 2025 | 12:31 AM

మండలంలో బ్రిటిష్‌ కాలంలో నిర్మించిన వంతెనలకు మోక్షం కలిగింది. రాజమహేంద్రవరం నుంచి విజయనగరం వరకు నిర్మిస్తున్న జాతీయ రహదారి 516-ఈ పనుల్లో భాగంగా శిథిలావస్థకు చేరిన వంతెలను తొలగించి వాటి స్థానంలో నూతన వంతెనలను నిర్మిస్తున్నారు. ఈ పనులు దాదాపు పూర్తికావచ్చాయి.

రామరాజుపాలెం వద్ద కొత్తగా వంతెన నిర్మించి అప్రోచ్‌ రోడ్డు వేసిన దృశ్యం

మండలంలో బ్రిటిష్‌ కాలం నాటి రెండు బ్రిడ్జిలను తొలగించి కొత్తగా నిర్మాణం

తీరనున్న వాహనచోదకుల కష్టాలు

కొయ్యూరు, మార్చి 10(ఆంధ్రజ్యోతి): మండలంలో బ్రిటిష్‌ కాలంలో నిర్మించిన వంతెనలకు మోక్షం కలిగింది. రాజమహేంద్రవరం నుంచి విజయనగరం వరకు నిర్మిస్తున్న జాతీయ రహదారి 516-ఈ పనుల్లో భాగంగా శిథిలావస్థకు చేరిన వంతెలను తొలగించి వాటి స్థానంలో నూతన వంతెనలను నిర్మిస్తున్నారు. ఈ పనులు దాదాపు పూర్తికావచ్చాయి.

మండలంలోని పెదమాకవరం పంచాయతీ రామరాజుపాలెం వద్ద, అలాగే మాకవరం- నడింపాలెం గ్రామాల మధ్య బ్రిటిష్‌ కాలంలో నిర్మించిన వంతెనలే గత ఏడాది వరకు రాకపోకలకు ఆధారం. కృష్ణాదేవిపేట నుంచి చింతపల్లి వెళ్లే ప్రఽధాన రహదారిలో సుమారు ఎనిమిది దశాబ్దాల క్రితం బ్రిటిష్‌ పాలనలో ఈ వంతెనలను నిర్మించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ వంతెనలకు కనీస మరమ్మతులు చేసిన దాఖలాలు లేవు. వంతెనలకు ఇరువైపులా రెయిలింగ్‌లు దెబ్బతిన్నా అధికారులు పట్టించుకోలేదు. దీంతో వాహనచోదకులు భయాందోళనతో రాకపోకలు సాగించేవారు. అయితే రాజమహేంద్రవరం నుంచి విజయనగరం వరకు జాతీయ రహదారి 516-ఈ పనులు ఈ గ్రామాల మీదుగా జరుగుతుండడంతో రామరాజుపాలెం, పి.మాకవరం వంతెనలకు మోక్షం కలిగింది. శిథిలావస్థకు చేరిన ఈ రెండు వంతెనలను పూర్తిగా తొలగించి వాటి స్థానంలో నూతన వంతెనలు నిర్మించారు. ప్రస్తుతం ఈ వంతెనలకు అప్రోచ్‌ రోడ్డు పనులు చేస్తున్నారు. ఈ ప్రాంతాల్లో కొత్త వంతెనలు నిర్మించడంపై స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Mar 11 , 2025 | 12:31 AM