suicide భర్త వేధింపులు తాళలేక మహిళ ఆత్మహత్య
ABN, Publish Date - Feb 24 , 2025 | 11:44 PM
suicide మండలంలోని బుషాభద్ర కాలనీలో వివాహిత కౌసల్య రౌళో (30) భర్త వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య కు పాల్పడింది.
సోంపేట, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): మండలంలోని బుషాభద్ర కాలనీలో వివాహిత కౌసల్య రౌళో (30) భర్త వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య కు పాల్పడింది. బారువ పోలీ సులు, స్థానికుల కథనం మేరకు.. బుషా భద్రకు చెంది న పంచనన్న రౌళో మొదటి భార్య మృతి చెందడంతో ఈదుపురానికి చెందిన కౌసల్య రౌళో ను తొమ్మిదేళ్ల కిందట వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న నాటి నుంచే కౌసల్యను వేధి స్తుండేవాడు. తరచూ ఇంట్లో గొడవలు జరిగేవి. ఈ నేపథ్యంలో వేధింపు లు తట్టుకోలేక సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొంది. కౌసల్య రౌళో సోదరి కున్ని రౌళో ఫిర్యాదుమేరకు బారువ ఎస్ఐ హరిబాబు నాయుడు కేసు నమోదు చేశారు. పంచనన్న రౌళోను అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - Feb 24 , 2025 | 11:44 PM