తడి, పొడి వ్యర్థాల నిర్వహణపై శిక్షణ
ABN, Publish Date - Mar 06 , 2025 | 11:37 PM
నందిగాంలోని చెత్త నుంచి సంపద తయారీ కేంద్రం లో టెక్కలి, మెళియాపుట్టి మండలాలకు చెందిన కార్యదర్శులకు జిల్లా పంచాయతీ వనరుల కేంద్రం ఆధ్వర్యంలో తడి,పొడి వ్యర్థాలు నిర్వహణపై గురువారం శిక్షణ నిర్వ హించారు.
నందిగాం,మార్చి 6(ఆంధ్రజ్యోతి):నందిగాంలోని చెత్త నుంచి సంపద తయారీ కేంద్రం లో టెక్కలి, మెళియాపుట్టి మండలాలకు చెందిన కార్యదర్శులకు జిల్లా పంచాయతీ వనరుల కేంద్రం ఆధ్వర్యంలో తడి,పొడి వ్యర్థాలు నిర్వహణపై గురువారం శిక్షణ నిర్వ హించారు. రిసోర్స్పర్సన్ పి.ఆనందరావు నేతృత్వంలో తడిచెత్త నుంచి వర్మీకంపోస్ట్ తయారీ, పంచాయతీల ఆర్థికాభివృద్ధిలో పొడిచెత్త అమ్మకాలతో కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఈవోపీఆర్డీలు డి.రామకృష్ణ, కె.సింహాద్రి, టెక్కలి ఈవో జగన్నాథరావు, కార్యదర్శులు కె.గోపీనాథ్, సంతోష్కుమార్ పాల్గొన్నారు.
ఫహిరమండలం, మార్చి6 (ఆంధ్రజ్యోతి): హిరమండలంలో చెత్త నుంచి సంపద తయారీ కేంద్రం వద్ద గురువారం ఘన వ్యర్ధాల నిర్వహణపై డీపీఆర్సీ రిసోర్స్ పర్సన్స్ కొత్తూరు, హిరమండలం, ఎల్.ఎన్.పేట, సరుబుజ్జిలి, పాతపట్నం మండలాలకు చెందిన పంచాయతీ విస్తరణాధికారులు, కార్యదర్శులు,గ్రీన్ అంబాసిడర్లకు శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా టెక్కలి డివిజనల్ పంచాయతీ అధికారి ఆర్.గోపాలకృష్ణ మాట్లాడుతూ చెత్త సంపద కేంద్రాలను వినియోగంలోకి తీసుకురావాలని కోరారు.
Updated Date - Mar 06 , 2025 | 11:37 PM