సమస్యల పరిష్కారంలో సమన్వయంతో సాగండి
ABN, Publish Date - Feb 22 , 2025 | 11:31 PM
ప్రజా సమస్యల పరిష్కారంలో అఽధికారులు సిబ్బందితో కలిసి సమన్వయంతో సాగాలని ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య అన్నారు. శనివారం మునిసిపల్ సమాశం హాలులో నియోజకవర్గ అఽధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు అభివృద్ధికి నిరంతరం శ్రమించాలని సూచించారు. విధుల్లో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా సేవలందించాలన్నారు. అనంతరం అఽధికారుల నుంచి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
ఎమ్మెల్యే కొండయ్య
చీరాల, ఫిబ్రవరి22 (ఆంధ్రజ్యోతి) : ప్రజా సమస్యల పరిష్కారంలో అఽధికారులు సిబ్బందితో కలిసి సమన్వయంతో సాగాలని ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య అన్నారు. శనివారం మునిసిపల్ సమాశం హాలులో నియోజకవర్గ అఽధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు అభివృద్ధికి నిరంతరం శ్రమించాలని సూచించారు. విధుల్లో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా సేవలందించాలన్నారు. అనంతరం అఽధికారుల నుంచి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నియోజకవర్గ క్యాంప్ కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. దీంతో అర్జీదారులు పెద్ద ఎత్తున పోటెత్తారు. ఎమ్మెల్యే వారి నుంచి అర్జీలు స్వీకరించి ప్రాధాన్యతాక్రమంలో పరిష్కరిస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఆర్డీవో చంద్రశేఖర్ నాయుడు, తహసీల్దార్ గోపీకృష్ణ, పార్వతి సిబ్బంది, టీడీపీ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Updated Date - Feb 22 , 2025 | 11:31 PM