హోలీక్రాస్ సెంటనరీ చర్చి ప్రారంభం
ABN, Publish Date - Feb 09 , 2025 | 12:08 AM
నంద్యాల పట్టణంలోని ఆర్ఎస్రోడ్లో హోలీక్రాస్ సెంటనరీ చర్చి శనివారం ఘనంగా ప్రారంభమైంది. ఇంచార్జి బిషప్ రైట్ రెవరెండ్ డాక్టర్ జార్జ్ కొర్నోలియస్, తెలుగు డయాసస్లో ఉన్న బిషప్లు పాల్గొని శిలాఫలకాన్ని ఆవిష్కరించి చర్చిని ప్రారంభించారు.
నంద్యాల కల్చరల్, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి): నంద్యాల పట్టణంలోని ఆర్ఎస్రోడ్లో హోలీక్రాస్ సెంటనరీ చర్చి శనివారం ఘనంగా ప్రారంభమైంది. ఇంచార్జి బిషప్ రైట్ రెవరెండ్ డాక్టర్ జార్జ్ కొర్నోలియస్, తెలుగు డయాసస్లో ఉన్న బిషప్లు పాల్గొని శిలాఫలకాన్ని ఆవిష్కరించి చర్చిని ప్రారంభించారు. అనంతరం వారు దైవ సందేశాన్ని ఇచ్చారు. ప్రజలు భక్తి శ్రద్ధలతో, సమాజంలో అందరూ సుఖసంతోషాలతో జీవించాలని, ద్వేష, ఈర్ష్య, అసూయలు వదిలి, ప్రేమ, క్షమాపణ, దైవ చింతనతో మెలగాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర న్యాయశాఖమంత్రి ఎన్ఎండీ ఫరూక్ పాల్గొని మాట్లాడుతూ హోలీక్రాస్ చర్చి విశ్వాసానికి ప్రతిక అన్నారు. ఈ కార్యక్రమంలో బిషప్ పద్మారావు, హోలీక్రాస్ కేథడ్రిల్ గురువులు పాస్టరేట్, కమిటి సెక్రటరీ ప్రభుదాసు, ట్రెజరర్ స్టీఫెన్, విలియం ఫిలిప్, క్రైస్తవులు పాల్గొన్నారు.
Updated Date - Feb 09 , 2025 | 12:08 AM