ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మల్లన్న బ్రహ్మోత్సవాలకు రండి

ABN, Publish Date - Feb 17 , 2025 | 11:19 PM

శ్రీశైలంలో భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారి బ్రహ్మోత్సవాలకు సీఎం నారా చంద్రబాబు నాయుడును శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌ రెడ్డి, ఆలయ ఈఓ ఎం.శ్రీనివాసరావుతో పాటు పండితులు ఆహ్వానించారు.

ముఖ్యమంత్రిని ఆహ్వానించిన ఎమ్మెల్యే, ఈవో

సీఎం చంద్రబాబుకు ఆహ్వానం

శ్రీశైలం, ఫిబ్రవరి 17(ఆంధ్రజ్యోతి): శ్రీశైలంలో భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారి బ్రహ్మోత్సవాలకు సీఎం నారా చంద్రబాబు నాయుడును శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌ రెడ్డి, ఆలయ ఈఓ ఎం.శ్రీనివాసరావుతో పాటు పండితులు ఆహ్వానించారు. సోమవారం అమరావతిలోని సీఎం చంద్రబాబు క్యాంపు కార్యాలయంలో వారు కలిశారు. ఈ సందర్భంగా సీఎంకు ఆలయ పండితులు స్వామివారి ప్రసాదంతో పాటు చిత్రపటాన్ని అందజేసి ఆశీర్వదించారు. శ్రీశైల మహా క్షేత్రంలో ఫిబ్రవరి 19 నుంచి మార్చి ఒకటో తేదీ వరకు బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయి.

గవర్నర్‌కు ఆహ్వానం : శ్రీశైలంలో మహాశివరాత్రి ఉత్సవాలకు ఆలయ అధికారులు రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ను సోమవారం కలిసి ఆహ్వానం పలికారు. అదేవిధంగా రాష్ట్ర మంత్రులు బీసీ జనార్దన్‌ రెడ్డి, పయ్యావుల కేశవ్‌ను కలిశారు.

Updated Date - Feb 17 , 2025 | 11:19 PM