ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ముగిసిన సుబ్బారాయుడి కల్యాణ మహోత్సవాలు

ABN, Publish Date - Feb 08 , 2025 | 01:15 AM

సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వార్షిక కల్యాణ మహోత్సవాలు స్వామి పవళింపు సేవతో ముగిశాయి.

ప్రత్యేక పూజలు చేస్తున్న అర్చకుడు

మోపిదేవి, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి): సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వార్షిక కల్యాణ మహోత్సవాలు స్వామి పవళింపు సేవతో ముగిశాయి. మాఘ శుద్ధ చవితి ఆదివారం స్వామిని పెండ్లి కుమారుడిని చేయడంతో కల్యాణ మహోత్సవాలు ప్రారంభమై మాఘశుద్ధ నవమి గురువారం రాత్రి పవళింపు సేవతో ముగిశాయి. మహోత్సవాల్లో భాగంగా స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి ద్వాదశ ప్రదక్షిణల కార్యక్రమాన్ని అర్చక బృందం శాస్త్రోక్తంగా, సంప్రదాయబద్ధంగా నిర్వహించింది. ఆలయ ఈవో డి.శ్రీరామవరప్రసాదరావు ఆధ్వర్యంలో ప్రధాన అర్చకుడు బుద్ధు పవన్‌ కుమార్‌శర్మ, వే ద పండితులు శాస్త్రోక్తంగా పవళింపు సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. విశేష అలంకరణ చేసిన స్వామి, అమ్మవార్లకు కల్యాణ మండపంలో పవళింపు సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు.

Updated Date - Feb 08 , 2025 | 01:15 AM