ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రొయ్యూరులో ఇసుక క్వారీ ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణ

ABN, Publish Date - Feb 11 , 2025 | 01:10 AM

రొయ్యూరు పంచాయతీ కార్యాలయం వద్ద సోమవారం నూతన ఇసుక క్వారీ ఏర్పాటుపై పర్యావరణ సంబంధిత ప్రజాభిప్రాయ సేకరణ కోసం సదస్సు నిర్వహించారు.

మాట్లాడుతున్న ఏపీ కాలుష్య నియంత్రణ మండలి ఈఈ శ్రీనివాస్‌, పక్కన ఆర్డీవో హేల షారోన్‌

తోట్లవల్లూరు, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): రొయ్యూరు పంచాయతీ కార్యాలయం వద్ద సోమవారం నూతన ఇసుక క్వారీ ఏర్పాటుపై పర్యావరణ సంబంధిత ప్రజాభిప్రాయ సేకరణ కోసం సదస్సు నిర్వహించారు. సదస్సులో ఆర్డీవో హేలా షారోన్‌, ఏపీ కాలుష్య నియంత్రణ మడలి ఈఈ శ్రీనివాస్‌, తహసీల్దార్‌ ఎం కుసుమకుమారి పొల్గొన్నారు. రొయ్యూరు రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్‌ 270లో 25 హెక్టార్ల విస్తీర్ణంలో క్వారీ ప్రారంభించి 2.50 లక్షల క్యూబిక్‌ మీటర్ల ఇసుక తవ్వకాలు జరిపిపేందుకు సదస్సు ఏర్పాటు చేశామని ఆర్డీవో వివరించారు. గ్రామంలో అవసరాలకు ప్రజలు ఇసుక తీసుకెళ్లొచ్చని, 12 ఎకరాలు దాటిన క్వారీలో మినీ జేసీబీలు ఉపయోగించే అంశంపై ప్రజలు అభిప్రాయాలను తెలపాలని ఏపీ కాలుష్య నియంత్రణ మండలి ఈఈ శ్రీనివాస్‌ విజ్ఞప్తి చేశారు. దీంతో కార్మికులు వేదిక వద్దకు వచ్చి యంత్రాలు వినియోగిస్తే తమ ఉపాధి దెబ్బతింటుందని, మీకెంత ఇసుక అవసరమైనా తాము లోడింగ్‌ చేసి అందిస్తామని, ఇదే తమ అభిప్రాయమని స్పష్టం చేశారు. సంతకాలు చేసి అందించాలని, వెంటనే సదస్సు ముగించి వెళ్లి పోయారు. వీఆర్వోలు సీహెచ్‌ శ్రీనివాసరావు, బసవరావు పాల్గొన్నారు.

నేడు తోట్లవల్లూరులో సదస్సు

తోట్లవల్లూరులో మంగళవారం పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ సదస్సు జరుగనుందని తహసీల్దార్‌ ఎం.కుసుమకుమారి తెలిపారు.

Updated Date - Feb 11 , 2025 | 01:10 AM