విద్యార్థులకు అభినందనలు
ABN, Publish Date - Feb 18 , 2025 | 12:15 AM
విద్యార్థులు చదువు సంబంధమైన పోటీలో పాల్గొనడం వల్ల నైపుణ్యాలను మరింత మెరుగుపరచుకోవచ్చని వీరమాచనేని పద్దయ్య సిద్ధార్థ పబ్లిక్సూల్ ప్రిన్సిపాల్ మేడా సీతారామయ్య చెప్పారు.
విద్యార్థులకు అభినందనలు
మొగల్రాజపురం, ఫిబ్రవరి 17 ( ఆంధ్రజ్యోతి): విద్యార్థులు చదువు సంబంధమైన పోటీలో పాల్గొనడం వల్ల నైపుణ్యాలను మరింత మెరుగుపరచుకోవచ్చని వీరమాచనేని పద్దయ్య సిద్ధార్థ పబ్లిక్సూల్ ప్రిన్సిపాల్ మేడా సీతారామయ్య చెప్పారు. పీబీ సిద్ధార్థ కళాశాల స్టూడెంట్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిక్స్ ఆధ్వర్యంలో ఈ నెల 12న జరిగిన సింటిలా 6.0 కార్యక్రమంలో పాల్గొని ప్రథమ, ద్వితీయ, తృతీయ, కన్సొలేషన్ బహుమతులు సాధించిన విద్యార్థులను సోమవారం పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో అభినందించారు. వైస్ ప్రిన్సిపాల్ రోజ్మేరీ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Updated Date - Feb 18 , 2025 | 12:15 AM