మహిళా దినోత్సవానికి చమర్తికి ఆహ్వానం
ABN, Publish Date - Mar 06 , 2025 | 11:54 PM
అన్నమయ్య జిల్లా రాజంపేటలో జరగనున్న ఆర్టీసీ మహిళా దినోత్సవానికి టీడీపీఈ పార్లమెంట్ అధ్యక్షుడు జగనమోహనరాజును ఆహ్వానించారు.
రాజంపేట, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): అన్నమయ్య జిల్లా రాజంపేటలో జరగనున్న ఆర్టీసీ మహిళా దినోత్సవానికి టీడీపీఈ పార్లమెంట్ అధ్యక్షుడు జగనమోహనరాజును ఆహ్వానించారు. రాజంపేట ప ట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు ఆర్టీసీ ఎంప్లాయీస్ యూ నియన నాయకులు పలు సమస్యలను వారి దృష్టికి తీసుకువచ్చారు. జగనమోహనరాజు ఆర్టీసీ సమస్యలపై సానుకూలగా స్పందిస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన జోనల్ నాయకులు రమణ, జిల్లా కార్యదర్శి బీసీ శేఖర్, సీనియర్ నాయకులు చలపతి, డిపో గౌరవాధ్యక్షుడు మాథ్యూస్, డిపో అధ్యక్షుడు సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Mar 06 , 2025 | 11:54 PM