సబ్జైలు తనిఖీ
ABN, Publish Date - Jan 21 , 2025 | 01:37 AM
స్థానిక సబ్జైలును జిల్లా న్యాయసేవాధికారి సంస్థ కార్యదర్శి శివప్రసాద్యాదవ్ సోమవారం తనిఖీ చేశారు. ఖైదీలు ఉండే గదులను, వంట గదిని పరిశీ లించారు.
ధర్మవరం, జనవరి 20(ఆంధ్రజ్యోతి): స్థానిక సబ్జైలును జిల్లా న్యాయసేవాధికారి సంస్థ కార్యదర్శి శివప్రసాద్యాదవ్ సోమవారం తనిఖీ చేశారు. ఖైదీలు ఉండే గదులను, వంట గదిని పరిశీ లించారు. అనంతరం ఖైదీలతో మాట్లాడుతూ.. వసతులు సరిగా ఉన్నాయా లేదా... సరైన భోజనం అందిస్తున్నారనా.. లేదా.. అని ఆరాతీశారు. ఉచితంగా న్యాయం సహాయం కావాలనుకునే వారు తమకు సమాచారం అందించవచ్చన్నారు. అనంతరం జైలులో ఉన్న పరిసర ప్రాంతాలను ఆయన పరిశీలించారు. ఆయన వెంట సబ్ జైలు సూపరింటెండెంట్ బ్రహ్మంరెడ్డి, న్యాయవాదులు కృష్ణమూర్తి, బాల సుదరి, పారాలీగల్ వాలంటరీ షామీర్బాషా ఉన్నారు.
Updated Date - Jan 21 , 2025 | 01:37 AM