సత్తా చాటిన విద్యార్థులకు అభినందన
ABN, Publish Date - Feb 15 , 2025 | 12:22 AM
స్కూల్ ఆఫ్ గేమ్స్-2025 కీడల్లో సత్తాచాటి.. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన బుక్కపట్నం బాలుర పాఠశాలకు చెందిన 21 విద్యార్థులను డీఈఓ క్రిష్టప్ప శుక్రవారం అభినందించారు.
విద్యార్థులకు మెమెంటోలు అందిస్తున్న డీఈఓ
బుక్కపట్నం, ఫిబ్రవరి 14(ఆంధ్రజ్యోతి): స్కూల్ ఆఫ్ గేమ్స్-2025 కీడల్లో సత్తాచాటి.. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన బుక్కపట్నం బాలుర పాఠశాలకు చెందిన 21 విద్యార్థులను డీఈఓ క్రిష్టప్ప శుక్రవారం అభినందించారు. వీరికి మెమెంటోలు, ప్రశాంసాపత్రాలు అందించారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు రాష్ట్రస్థాయిలో రాణించడం హర్షిచదగ్గ విషయమన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ గోపాల్నాయక్, హెచఎం జగదీష్, పీడి నాగరాజు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Updated Date - Feb 15 , 2025 | 12:22 AM