nara లోకేశకు ఘన స్వాగతం
ABN, Publish Date - Mar 11 , 2025 | 01:35 AM
ఖాద్రీ నారసింహుడికి పట్టు వ సా్త్రలను సమర్పించేందుకు వచ్చిన మంత్రి నారా లోకే శ, జిల్లా ఇనచార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్కు పుట్టపర్తిలోని సత్యసాయి విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది.
పుట్టపర్తి రూరల్/కదిరి అర్బన/ముదిగుబ్బ, మార్చి 10(ఆంధ్రజ్యోతి): ఖాద్రీ నారసింహుడికి పట్టు వ సా్త్రలను సమర్పించేందుకు వచ్చిన మంత్రి నారా లోకే శ, జిల్లా ఇనచార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్కు పుట్టపర్తిలోని సత్యసాయి విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. విజయవాడ నుంచి పుట్టపర్తికి వారు ప్రత్యేక విమానంలో సోమవారం సాయంత్రం 5.32 గంటకు చేరుకున్నారు. హిందూపురం ఎంపీ పార్థసారథి, కదిరి ఎమ్యెల్యే కందికుంటప్రసాద్, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, కలెక్టర్ టీఎస్ చేతన, ఎస్పీ వీరత్న, ఆర్డీఓ సువర్ణ, టీడీపీ ఉమ్మడి జిల్లా కో ఆర్డినేటర్ కోవెలమూడి రవీంద్ర, టీడీపీ రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ బీవీ వెంకట్రాముడు, ధర్మవరం నియోజకవర్గ ఇనచార్జి పరిటాల శ్రీరామ్, బీజేపీ నాయకుడు విష్ణువర్థనరెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు అంజినప్ప, అనంతపురం జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్, రాష్ట్ర మైనారిటీ విభాగం కార్యదర్శి మహమ్మద్రఫీ, రాష్ట్ర వడ్డెర సాధికారత కమిటీ కో ఆర్డినేటర్ వెంకట్, రాష్ట్రమాదిగ కార్పొరేషన డైరక్టర్ బేకరి గంగాధర్, టీడీపీ హిందూపురం కో ఆర్డినేటర్ శ్రీనివాసులు, పురం మున్సిపల్ చైర్మన రమేష్, జిల్లా బోయసాధికార కమిటీ అధ్యక్షుడు రామాంజినేయులు, టీడీపీ జిల్లా కార్యదర్శి సామకోటి ఆదినారాయణ, మాజీ మునిసిపల్ చైర్మన్లు పీసీ గంగన్న, బెస్త చలపతి, నాయకులు ఆలం నరసాయుడు, ముంటిమడుగు కేశవరెడ్డి, చమన తనయుడు ఉమర్ ముక్తియార్, స్థానిక నాయకులు రత్నప్పచౌదరి, సాలక్కగారి శ్రీనివాసులు, కన్వీనర్లు శ్రీనివాసులు, రామకృష్ణ, గోపాల్రెడ్డి, జయచంద్ర, మల్లిరెడ్డి, మైలే శంకర్ స్వాగతం పలికారు. కదిరి నియోజకవర్గంలోని పట్నం వద్ద నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. పెద్దఎత్తున బాణసంచా పేల్చి, పూలమాలలు వేశారు. కుటాగుళ్ల వద్ద గజమాలతో స్వాగతం పలికారు.
Updated Date - Mar 11 , 2025 | 01:35 AM