వంటావార్పుతో న్యాయవాదుల నిరసన
ABN, Publish Date - Dec 27 , 2024 | 11:43 PM
జి ల్లా కేంద్రంలోని పీజేపీ కాలనీలోనే నూతన కో ర్టు సముదాయాలకు స్థలం కేటాయింపు జరగాలని కోరుతూ శుక్రవారం న్యాయవాదులు వం టావార్పుతో నిరసన వ్యక్తం చేశారు.
గద్వాలక్రైం, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): జి ల్లా కేంద్రంలోని పీజేపీ కాలనీలోనే నూతన కో ర్టు సముదాయాలకు స్థలం కేటాయింపు జరగాలని కోరుతూ శుక్రవారం న్యాయవాదులు వం టావార్పుతో నిరసన వ్యక్తం చేశారు. జిల్లా కేం ద్రంలోని కోర్టు ఎదురుగా గత కొన్ని రోజులుగా న్యాయవాదులు చేస్తున్న నిరసన దీక్షలు తారాస్ధాయికి చేరాయి. ఈ క్రమంలో వంటావార్పుతో వినూత్నంగా నిరసన చేశారు. వీరికి అయిజ అఖిలపక్షం కమిటీ సభ్యులు, టీఎస్ పీఆర్టీ యూ ఉపాధ్యాయ సంఘం నేతలు, సిపిఐ పార్టీ నాయకులు మాట్లాడుతూ నూతనంగా నిర్మించే కోర్టు సముదాయాలను అనంతపురం గట్లలో కాకుండా కలెక్టరేట్ సమీపంలోని పిజేపి క్యాంపు కాలనీలో ఏర్పాటు చేసి అందరికీ అందుబాటులో ఉండేలా చూడాలని కోరారు.
Updated Date - Dec 27 , 2024 | 11:43 PM