విరాళాలు సేకరించడం అభినందనీయం
ABN, Publish Date - Dec 30 , 2024 | 11:23 PM
విద్యార్థులు మానవతా దృక్పథం తో వరద బాధితులకు విరాళాలు సేకరించి ఇవ్వ డం అభినందనీయమని కలెక్టర్ ఆదర్శ్ సురభి ప్రశంసించారు.
వనపర్తి రాజీవ్చౌరస్తా, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి) : విద్యార్థులు మానవతా దృక్పథం తో వరద బాధితులకు విరాళాలు సేకరించి ఇవ్వ డం అభినందనీయమని కలెక్టర్ ఆదర్శ్ సురభి ప్రశంసించారు. వరద బాధితుల సహాయార్ధం వనపర్తి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు జూనియ ర్ కళాశాలల విద్యార్థులు విరాళాలు సేకరించి రూ.6,21,100 సీఎం సహాయనిధికి పంపించారు. ఆ విరాళాల వివరాలను సోమవారం కలెక్టర్ ఆ దర్శ్ సురభి చేతుల మీదుగా కలెక్టరేట్లో తెలి యజేశారు. విరాళాలు సేకరించిన విద్యార్థులను, సహకరించిన ప్రిన్సిపాల్స్ను ఈ కార్యక్రమాన్ని రూపొందించిన ఇంటర్ విద్యాధికారి ఎర్ర అంజ య్యను కలెక్టర్ అభినందించారు.
Updated Date - Dec 30 , 2024 | 11:23 PM