మత్తు పదార్థాల నిర్మూలన కోసం తనిఖీలు
ABN, Publish Date - Dec 31 , 2024 | 11:44 PM
డిసెంబరు 31 సందర్భంగా జిల్లా కేంద్రంలో నార్కోటిక్స్ స్నైపర్ పోలీస్ జాగిలంతో పలు ప్రదేశాల్లో ఆకస్మికంగా తనిఖీలు నిర్వ హించినట్లు అదనపు ఎస్పీ ఎండీ.రియాజ్ హుల్ హక్ తెలిపారు.
- ఏఎస్పీ ఎండీ.రియాజ్ హుల్హక్
నారాయణపేట, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి): డిసెంబరు 31 సందర్భంగా జిల్లా కేంద్రంలో నార్కోటిక్స్ స్నైపర్ పోలీస్ జాగిలంతో పలు ప్రదేశాల్లో ఆకస్మికంగా తనిఖీలు నిర్వ హించినట్లు అదనపు ఎస్పీ ఎండీ.రియాజ్ హుల్ హక్ తెలిపారు. గంజాయి, మత్తు పదార్థాల నిర్మూలన, అక్రమ రవాణా నిరోధానికి ఈ తని ఖీలు నిర్వహించినట్లు ఏఎస్పీ వివరించారు. పార్శిల్ సర్వీసెస్, కొరియర్ సెంటర్స్, పాన్షాప్లు, బస్టాండ్లు, బార్స్, లాడ్జీలలో తనిఖీలు నిర్వహిం చామన్నారు. ఎవరైనా గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలు వినియోగిస్తున్నా, రవాణి చేసినా వెంటనే డయల్ 100కు కాల్ చేయాలని కోరారు. ఏఎస్ఐ ఆంజనేయులు, డాగ్ విక్కీ, డాగ్ హ్యండ్లర్ పరమేష్ ఉన్నారు.
Updated Date - Dec 31 , 2024 | 11:44 PM