Hyderabad: మితిమీరుతున్న హిజ్రాల ఆగడాలు.. బలవంతపు వసూళ్లతో పరేషాన్
ABN, Publish Date - Mar 29 , 2024 | 12:55 PM
నగరంలో రోజురోజుకు హిజ్రాల ఆగడాలు మితిమిరిపోతున్నాయి. బలవంతపు వసూళ్లకు పాల్పడుతూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు.
హైదరాబాద్: నగరంలో రోజురోజుకు హిజ్రాల ఆగడాలు మితిమిరిపోతున్నాయి. బలవంతపు వసూళ్లకు పాల్పడుతూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. కొండాపూర్(Kondapur)లో గత గురువారం అర్ధరాత్రి ఒంటిగంటకు సుమారు 30మంది హిజ్రాలు ఓ వ్యక్తిపై దాడిచేసి బలవంతంగా అతని అకౌంట్ నుంచి రూ.30 వేలు పోన్పే చేయించుకున్నట్లు తెలిసింది. సదరు వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ, దీనిపై పోలీసులు ఎటువంటి కేసు నమోదు చేయలేదు. ఈ విషయం సోషల్మీడియాలో వైరల్గా మారింది. హెల్ప్చేయండి అంటూ పోలీసులకు, మీడియా ప్రతినిధులకు, రాజకీయ నాయకులకు ఫొటోలు, వీడియోలు షేర్ చేశాడు. దీనిపై గచ్చిబౌలి(Gachibowli) పోలీసులను వివరణ కోరగా తమకు ఎలాంటి ఫిర్యాదూ రాలేదని లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Updated Date - Mar 29 , 2024 | 12:55 PM