Dussehra Effect: పల్లెబాట పట్టిన ప్రజలు.. బస్టాండుల్లో ప్రయాణికుల సందడి
ABN, Publish Date - Oct 05 , 2024 | 02:38 PM
Telangana: తెలుగు మాస క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది దసరా పండుగ అక్టోబర్ 12వ తేదీన రానుంది. తమ సొంత ఊర్లల్లో దసరా పండుగను జరుపుకునేందు ప్రజలు గ్రామాలకు బయలుదేరారు. బస్సులు, రైళ్లు, సొంత వాహనాల్లో గ్రామాలకు తరలివెళ్తున్నారు ప్రజలు. కొంతమంది ఆర్టీసీకి జై కొట్టి బస్సుల్లో ప్రయాణమయ్యేందుకు సిద్ధమయ్యారు. దీంతో హైదరాబాద్లో బస్టాండ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి.
మరో వారంలో దసరా పండుగ రాబోతోంది. ఇప్పటికే స్కూళ్లకు సెలవులు ప్రకటించేశారు కూడా. స్కూళ్లకు సెలవులు ఇచ్చేయడంతో తమ పిల్లలతో కలిసి ప్రజలు పల్లెబాట పట్టారు
తెలుగు మాస క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది దసరా పండుగ అక్టోబర్ 12వ తేదీన రానుంది. తమ సొంత ఊర్లల్లో దసరా పండుగను జరుపుకునేందు ప్రజలు గ్రామాలకు బయలుదేరారు.
బస్సులు, రైళ్లు, సొంత వాహనాల్లో గ్రామాలకు తరలివెళ్తున్నారు ప్రజలు. కొంతమంది ఆర్టీసీకి జై కొట్టి బస్సుల్లో ప్రయాణమయ్యేందుకు సిద్ధమయ్యారు.
హైదరాబాద్లో బస్టాండ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి.
దసరా పండుగను పురస్కరించుకుని టీజీఆర్టీసీ ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేసింది.
ప్రజలు తమ సొంతూళ్లకు వెళ్లేందుకు బస్టాండ్లకు చేరడంతో ఒక్కసారిగా ప్రయాణికుల రద్దీ పెరిగిపోయింది.
జేబీఎస్, ఎంజీబీఎస్ బస్టాండ్లు ప్రయాణికులతో నిండిపోయాయి. ఎంతో ఆనందంగా సొంతూళ్లుకు వెళ్లేందుకు బస్టాండ్ల వద్ద బస్సుల కోసం ప్రయాణికులు వేచి చూస్తున్నారు.
Updated Date - Oct 05 , 2024 | 02:39 PM