ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Moscow Attack: మాస్కో ఉగ్రదాడిలో దిమ్మతిరిగే ట్విస్ట్.. మొత్తం ఆ యాప్ నుంచే..

ABN, Publish Date - Mar 24 , 2024 | 03:01 PM

యావత్ ప్రపంచాన్ని హడలెత్తించిన మాస్కో ఉగ్రదాడిలో (Moscow Terror Attack) తాజాగా దిమ్మతిరిగే ట్విస్ట్ వెలుగు చూసింది. ‘టెలిగ్రామ్’ (Telegram) అనే మెసేజింగ్ యాప్ ద్వారా ఈ మొత్తం వ్యవహారం నడిపినట్లు వెలుగులోకి వచ్చింది. అంతేకాదు.. కేవలం డబ్బుల కోసమే తాము ఈ పనికి పాల్పడినట్లు.. ముష్కరుల్లో ఓ వ్యక్తి పేర్కొన్నాడు. తమను ఆ మెసేజింగ్ యాప్ ద్వారా సంప్రదించారని.. తమకు డబ్బులు, ఆయుధాలు సరఫరా చేసిందెవరో తెలియదని అతడు పేర్కొన్నాడు.

యావత్ ప్రపంచాన్ని హడలెత్తించిన మాస్కో ఉగ్రదాడిలో (Moscow Terror Attack) తాజాగా దిమ్మతిరిగే ట్విస్ట్ వెలుగు చూసింది. ‘టెలిగ్రామ్’ (Telegram) అనే మెసేజింగ్ యాప్ ద్వారా ఈ మొత్తం వ్యవహారం నడిపినట్లు వెలుగులోకి వచ్చింది. అంతేకాదు.. కేవలం డబ్బుల కోసమే తాము ఈ పనికి పాల్పడినట్లు.. ముష్కరుల్లో ఓ వ్యక్తి పేర్కొన్నాడు. తమను ఆ మెసేజింగ్ యాప్ ద్వారా సంప్రదించారని.. తమకు డబ్బులు, ఆయుధాలు సరఫరా చేసిందెవరో తెలియదని అతడు పేర్కొన్నాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను జాతీయ టీవీ ఛానెళ్లు ప్రసారం చేశాయి.


ఈ ఉగ్రదాడి జరిగిన వెంటనే రంగంలోకి దిగిన రష్యా దళాలు (Russian Troups).. నలుగురు నిందితుల్ని ‘ఖట్సన్’ అనే గ్రామం వద్ద అరెస్ట్ చేశాయి. వారిలో ఓ వ్యక్తిని ఈ దాడి గురించిన వివరాలు అడగ్గా.. డబ్బుల కోసమే తాను ప్రజలపై కాల్పులు జరిపానని స్పష్టం చేశాడు. తనకు 5 లక్షల రూబుళ్లను ఆఫర్‌ చేశారని అతడు చెప్పగా.. అందులో సగం మొత్తం అతని బ్యాంక్ ఖాతాలో వేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ దాడి వెనుక ఎవరున్నారని ప్రశ్నించగా.. ఆ విషయం తమకు తెలియదని, టెలిగ్రామ్ యాప్ ద్వారా వాళ్లు సంప్రదించారని చెప్పాడు. డబ్బులు, ఆయుధాలు సరఫరా చేసిన వాళ్లెవరో తెనకు తెలియదని వెల్లడించాడు. ఈ దాడి జరిపాక తమ ఆయుధాల్ని రోడ్డుపక్కన పారేశామని మరో దుండగుడు చెప్పాడు. ఆ నిందితులపై రష్యా దళాలు దాడులు చేసే దృశ్యాలు కూడా బయటకొచ్చాయి.

ఇదిలావుండగా.. రష్యా (Russia) రాజధాని మాస్కోలోని క్రాకస్‌ సిటీ కాన్సర్ట్‌ హాలులోకి నలుగురు ముష్కరులు దూసుకొచ్చి, ప్రజలపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడిలో ఇప్పటివరకూ 133 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. దాడికి పాల్పడిన ముష్కరులు తజికిస్థాన్‌కు చెందిన వారని రష్యా అధికారులు స్పష్టం చేశారు. ఈ దాడికి ఇప్పటికే ఇస్లామిక్ స్టేట్ (ISIS-K) బాధ్యత వహించింది. అయితే.. రష్యా మాత్రం ఉక్రేనియన్ లింక్‌ని అనుసరిస్తున్నట్లు సూచనలు ఉన్నాయి. కానీ.. ఉక్రెయిన్ అధికారులు ఈ దాడితో తమకెలాంటి సంబంధం లేదని గట్టిగా బదులిచ్చారు. అటు.. ఈ దాడి వెనుకున్న వారిని గుర్తించి తప్పకుండా శిక్షిస్తామని అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) ప్రతిజ్ఞ చేశారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 24 , 2024 | 03:01 PM

Advertising
Advertising