Home » Russia
రష్యా చమురు కొనుగోళ్లపై భారత్తో పాటు పలు దేశాలకు గతంలో ఇచ్చిన తాత్కాలిక సడలింపుల గడువు(మే 16)ను పెంచకూడదని ట్రంప్ నిర్ణయించారు. అయితే, దేశీయ ప్రయోజనాలే పరమావధిగా రష్యా నుంచి చమురు దిగుమతులను మునుపటిలాగే కొనసాగిస్తామని భారత్ తేల్చిచెప్పింది.
అమెరికా ఆంక్షల మినహాయింపులు ఉన్నా, లేకపోయినా రష్యా నుంచి ముడి చమురు కొనుగోళ్లు కొనసాగిస్తామని భారత కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దేశ ఇంధన భద్రత, వాణిజ్య ప్రయోజనాలే తమకు ముఖ్యమని కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు.
రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకోవడాన్ని అమెరికా తీవ్రంగా ఖండించింది. భారీ మూల్యం తప్పదని భారత్కు హెచ్చరికలు సైతం జారీ చేసింది. పెద్ద మొత్తంలో సుంకాలు విధిస్తామని స్పష్టం చేసింది.
రష్యా రాజధాని మాస్కో లక్ష్యంగా ఉక్రెయిన్ భారీగా డ్రోన్లతో విరుచుకుపడింది. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన ఈ దాడుల్లో ఓ ...
రష్యా-ఉక్రెయిన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు మరోసారి తీవ్రరూపం దాల్చాయి. ఇవాళ రష్యా రాజధాని మాస్కో రీజియన్ను లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ జరిపిన అత్యంత భారీ డ్రోన్ దాడిలో ఒక భారతీయ కార్మికుడు మరణించగా, మరో ముగ్గురు భారతీయులు తీవ్రంగా గాయపడ్డారు.
ఇంధన సరఫరా విషయంలో భారత ప్రయోజనాలకు నష్టం జరగనివ్వబోమని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ హామీనిచ్చారు. ఇంధన సరఫరాకు సంబంధించిన ఒప్పందాలన్నింటినీ నెరవేర్చుతామన్నారు. త్వరలో భారత పర్యటనకు రానున్న లావ్రోవ్ ఓ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య మూడు రోజుల కాల్పుల విరమణ (Ceasefire) ఒప్పందం కుదిరిందని ట్రంప్ వెల్లడించారు. దాదాపు నాలుగు సంవత్సరాలుగా రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భయపడుతున్నారా? ఉక్రెయిన్ తనపై హత్యాయత్నానికి పాల్పడుతుందని భావిస్తున్నారా? ఆ భయంతోనే బంకర్లలో దాక్కున్నారా? అవుననే అంటోంది అంతర్జాతీయ మీడియా.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతూనే ఉంది. దాడులు, ప్రతిదాడులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా రష్యాలోని మరో ముఖ్యమైన ఆయిల్ ఫెసిలిటీ భారీ దాడికి గురైంది. ఉక్రెయిన్ డ్రోన్ దాడులే ఈ ప్రమాదానికి కారణం.
రష్యా నుంచి భారత్కు ఎస్-400 ట్రియంఫ్ క్షిపణి వ్యవస్థ నాలుగో యూనిట్ అతి త్వరలో చేరుకోనుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మే నెల ప్రారంభంలో భారత్కు చేరుకునే అవకాశం ఉందన్నారు.