ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రాజ్యాంగ రచనలో తెలుగు వారి పాత్ర చిరస్మరణీయం

ABN, Publish Date - Dec 29 , 2024 | 05:07 AM

భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 ఏళ్లు పూర్తి అవుతున్న సందర్భంగా 2025వ సంవత్సరానికి నూతన కేలండర్‌ను ఆంధ్రప్రదేశ్‌ శాసనవ్యవస్థ ప్రత్యేకంగా రూపొందించింది.

అసెంబ్లీ కేలండర్‌ను ఆవిష్కరించిన చంద్రబాబు

అమరావతి, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 ఏళ్లు పూర్తి అవుతున్న సందర్భంగా 2025వ సంవత్సరానికి నూతన కేలండర్‌ను ఆంధ్రప్రదేశ్‌ శాసనవ్యవస్థ ప్రత్యేకంగా రూపొందించింది. ఆనాటి రాజ్యాంగ రచనలో భాగస్వాములైన తెలుగు ప్రముఖులను స్మరించుకునేలా ఆ కేలండర్‌ను తీర్చిదిద్దింది. ఈ వినూత్న కేలండర్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం ఉండవల్లిలోని నివాసంలో ఆవిష్కరించారు. రాజ్యాంగాన్ని రూపొందించడానికి బాధ్యత వహించిన నాయకులను, దార్శనికులను స్మరించుకోవడం సంతోషంగా ఉందని, రాజ్యాంగ రచనలో వారి పాత్ర చిరస్మరణీయమని సీఎం అన్నారు. ఆ ప్రముఖుల గొప్పతనాన్ని ఈ సందర్భంగా సీఎం గుర్తుచేశారు.

సామాజిక మాధ్యమాల్లో శాసన వ్యవస్థ సమాచారం

ఆంధ్రప్రదేశ్‌ శాసనవ్యవస్థ కోసం తొలిసారి ప్రవేశపెట్టిన సామాజిక మాధ్యమాల ఖాతాలను కూడా ముఖ్యమంత్రి ప్రారంభించారు. ‘ఎక్స్‌’, యూట్యూబ్‌లో ఃఔ్ఛజజీటఅుఽఛీజిట్చ ద్వారా, ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌ ద్వారా శాసనవ్యవస్థ సమాచారం అందుబాటులోకి వస్తుంది. ఈ కార్యక్రమంలో స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు, శాసనవ్యవస్థ సెక్రటరీ జనరల్‌ ప్రసన్నకుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - Dec 29 , 2024 | 05:07 AM