ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TSPSC: పేపర్ లీకేజీ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలి: కేటీఆర్‌

ABN, First Publish Date - 2023-03-15T22:50:46+05:30

టీఎస్‌పీఎస్సీ (TSPSC) పేపర్ లీకేజీ వ్యవహారంపై ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ స్పందించారు.

KTR on TSPSC paper leak case
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

హైదరాబాద్: టీఎస్‌పీఎస్సీ (TSPSC) పేపర్ లీకేజీ వ్యవహారంపై ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ స్పందించారు. పేపర్ లీకేజీ వెనుక బీజేపీ హస్తం ఉందని ఆరోపించారు. కేసులో ఏ2గా ఉన్న నిందితుడు రాజశేఖర్‌రెడ్డి బీజేపీ కార్యకర్త అని కేటీఆర్ ట్విటర్‌లో ఆరోపించారు. లీకేజీ అంశంపై సమగ్ర విచారణ చేయాలని డీజీపీని ట్విటర్ ద్వారా కోరారు.

మరోవైపు టీఎస్‌పీఎస్సీ ఉన్నతాధికారులతో (TSPSC officials) సిట్‌ అధికారి ఏఆర్‌ శ్రీనివాస్‌ (SIT officer AR Srinivas) భేటీ అయ్యారు. పరీక్షల నిర్వహణ, సీక్రెసీతో పాటు ప్రింటింగ్‌ వ్యవహారాలపై ఆరా తీసినట్లు తెలుస్తోంది. కాన్ఫిడెన్షియల్‌ రూమ్‌ను సిట్‌ అధికారి ఏఆర్‌ శ్రీనివాస్‌ పరిశీలించారు. కాన్ఫిడెన్షియల్‌ రూమ్‌ నుంచి పేపర్‌ బయటికి వెళ్లినట్లు గుర్తించారు. కాన్ఫిడెన్షియల్‌ రూమ్‌ ఇన్‌చార్జ్‌ శంకర్‌లక్ష్మిని పోలీసులు ప్రశ్నించారు. శంకర్‌లక్ష్మి దగ్గర ఉన్న పాస్‌వర్డ్‌, ఐడీలను ప్రవీణ్ చోరీ చేసినట్లు పోలీసులు చెప్పారు. నిందితుడు ప్రవీణ్‌ ఏఈ పేపర్స్‌ను పెన్‌డ్రైవ్‌లోకి ట్రాన్స్‌ఫర్‌ చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

టీఎస్‌పీఎస్సీ పరీక్ష పత్రాల లీకేజీ వ్యవహారం మరిన్ని కొత్త మలుపులు తిరుగుతోంది. అసిస్టెంట్‌ ఇంజనీర్‌ పరీక్ష ప్రశ్నపత్రాన్ని లీక్‌ చేసిన టీఎస్‌పీఎస్సీ ఉద్యోగి పులిదిండి ప్రవీణ్‌కుమార్‌ గ్రూప్‌-1 పరీక్ష రాయడం, ఇందులో అతనికి 103 మార్కులు రావడంతో ఈ పరీక్ష పేపర్‌ కూడా లీకైందా? అన్న అనుమానాలు బలపడుతున్నాయి. ప్రవీణ్‌ ఉన్నతాధికారుల అనుమతి తీసుకొని పరీక్ష రాశాడు. ఈ పరీక్షలో మొత్తం 150 మార్కులకుగాను ప్రవీణ్‌కు 103 మార్కులు వచ్చాయి. అతని బుక్‌లెట్‌ కోడ్‌ ఆధారంగా పోలీసులు కీ పేపర్‌ను పరిశీలించగా ఈ విషయం వెల్లడైనట్లు తేలింది. ఇన్ని మార్కులు వచ్చినా మెయిన్స్‌కు అతడు డిస్‌క్వాలిఫై అయ్యాడు. ప్రాథమిక సమాచారం (బుక్‌లెట్‌ కోడ్‌, హాల్‌టికెట్‌ నంబర్‌) నింపే క్రమంలో బబ్లింగ్‌ సరిగా చేయకపోవడంతో అతని ఓఎంఆర్‌ షీట్‌ డిస్‌క్వాలిఫై అయినట్లు తేలింది. ఈ పరీక్షకు సంబంధించిన ప్రశ్నలు, సమాధానాలు తదితర సమాచారం ప్రవీణ్‌ మొబైల్‌ ఫోన్‌లో దొరికినట్లు తెలిసింది. గ్రూప్‌-1 ప్రిలిమినరీ పేపర్‌ లీకైందన్న అనుమానాలకు ఇదే కారణమవుతోంది.

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో అరెస్టయిన ప్రధాన నిందితుడు ప్రవీణ్‌ పోలీసుల విచారణలో నోరు విప్పలేదని తెలిసింది. అయితే కేసులో ఏ2గా ఉన్న రాజశేఖర్‌రెడ్డి అలియాస్‌ రాజు మాత్రం పోలీసులకు పూర్తిగా సహకరించినట్లు సమాచారం. ప్రవీణ్‌ సూచన మేరకు అతడు ఇచ్చిన యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ ఆధారంగా ప్రశ్నపత్రాలను డౌన్‌లోడ్‌ చేసి పెన్‌డ్రైవ్‌లో కాపీ చేసి ఇచ్చానని రాజు వెల్లడించినట్లు తెలిసింది. ప్రవీణ్‌ సహకరించకపోవడంతో అతని మొబైల్‌ ఫోన్‌, కాల్‌డేటా, వాట్సాప్‌ చాటింగ్‌లు ఇతర కాంటాక్టులపై దృష్టి సారించారు. ప్రవీణ్‌ మొబైల్‌లో మహిళల నగ్న చిత్రాలు ఉన్నట్లు గుర్తించారు. 2017 నుంచి టీఎస్‌పీఎస్సీ లో పనిచేస్తున్న ప్రవీణ్‌ మొదట వెరిఫికేషన్‌ సెక్షన్‌లో పనిచేసేవాడు. నాలుగేళ్లపాటు అక్కడే పనిచేయడంతో వెరిఫికేషన్‌, ఇతర సాంకేతిక సమస్యల పరిష్కారం కోసం వచ్చే మహిళల ఫోన్‌ నంబర్‌లను ప్రవీణ్‌ తీసుకునేవాడు. వారితో కాంటాక్టులో ఉండేవాడు. వాట్సాప్‌ చాటింగ్‌లు చేస్తూ సాన్నిహిత్యం పెంచుకునేవాడు. ఈ మేరకు అతని మొబైల్‌లో చాటింగ్‌లతో పాటు కొందరు మహిళల నగ్న చిత్రాలు కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్లు తెలిసింది. ఈ క్రమంలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు రేణుకతో అయిన పరిచయంతోనే ఏఈ పరీక్షా పత్రాన్ని లీక్‌ చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నట్లు గుర్తించారు.

9 మంది నిందితుల రిమాండ్‌ రిపోర్టులో పోలీసులు పలు కీలక అంశాలను పేర్కొన్నారు. ఈ నెల 5న జరిగిన ఏఈ పరీక్ష పశ్న పత్రాలు లీకైనట్లు ఆధారాలు లభించాయని, మొత్తం 24 పేజీల ప్రశ్నపత్రాల నకళ్లు లభ్యమయ్యాయని తెలిపారు. వీటితోపాటు ఈ నెల 12న నిర్వహించాలనుకున్న టౌన్‌ప్లానింగ్‌ బిల్డింగ్‌ ఓవర్‌సీర్‌పరీక్షకు సంబంధించి 25 పేజీల ప్రశ్నపత్రాలు కూడా లభించినట్లు వెల్లడించారు. ఏ2 రాజశేఖర్‌రెడ్డి వెల్లడించిన సమాచారం ప్రకారం.. కాన్ఫిడెన్షియల్‌ సెక్షన్‌లో పనిచేస్తున్న సెక్షన్‌ ఆఫీసర్‌ శంకర్‌లక్ష్మి సిస్టమ్‌ రిపేర్‌కు వచ్చింది. దానిని మరమ్మతు చేసేందుకు రాజశేఖర్‌రెడ్డి వెళ్లాడు. అప్పటికే ఆమె నోట్‌బుక్‌ నుంచి యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ తస్కరించిన ప్రవీణ్‌ అక్కడికి చేరుకున్నాడు. శంకర్‌లక్ష్మి పని నిమిత్తం టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి రూమ్‌కు వెళ్లింది.

ఇదే అదనుగా భావించిన ప్రవీణ్‌.. ఆమె సిస్టమ్‌ నుంచి రాజశేఖర్‌రెడ్డి సహకారంతో ఏఈ ప్రశ్నపత్రాలతోపాటు టౌన్‌ప్లానింగ్‌ ఓవర్సీర్‌ ప్రశ్నపత్రాలను పెన్‌డ్రైవ్‌లో కాపీ చేయించి తీసుకున్నాడు. వాటిని ప్రింట్‌ తీసుకున్న ప్రవీణ్‌.. ఈ నెల 2న రేణుకకు వాటిని అందజేశాడు. ఆమె 5 లక్షలిచ్చి ప్రశ్నపత్రాలను తీసుకొని వెళ్లింది. భర్త ఢాక్యాతో కలిసి.. మేడ్చల్‌ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్‌ను సంప్రదించి పేపర్‌ అమ్మాలని చూశారు. అతను తన స్నేహితులు నీలేశ్‌, గోపాల్‌లకు సమాచారం ఇచ్చి వాటిని కొనుగోలు చేయించాడు. 14లక్షలకు బేరం కుదుర్చుకున్న నిందితులు 4 లక్షలు అడ్వాన్స్‌గా చెల్లించారు. ప్రవీణ్‌ మొబైల్‌, ల్యాప్‌ట్యాప్‌ను పోలీసులు ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపారు. ఆ రిపోర్టు వస్తే అనేక అంశాలపై స్పష్టత వస్తుందని తెలిపారు.

Updated Date - 2023-03-15T22:50:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising