ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Minister Talasani: 70 ఏండ్లలో జరగని అభివృద్ధి 9 ఏళ్లలో జరిగింది...

ABN, First Publish Date - 2023-06-02T10:37:20+05:30

మెదక్ జిల్లా: మెదక్ కలెక్టరేట్‌లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. జాతీయ జెండా అవిష్కరణతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వేడుకలు ప్రారంభించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మెదక్ జిల్లా: మెదక్ కలెక్టరేట్‌లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. జాతీయ జెండా అవిష్కరణతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వేడుకలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్ రెడ్డి, మదన్ రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ హేమలత శేఖర్ గౌడ్, జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ రోహిణి ప్రియదర్శిని తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని అమరవీరుల కుటుంబాలను సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేయడమే లక్ష్యమన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో సంక్షేమ పథకాలు అమలుపరిస్తూ దేశానికే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తోందన్నారు.

తెలంగాణ ఆచరిస్తుంది.. దేశం అనుసరిస్తోందని చెప్పుకునే స్థాయికి ఎదగడం గర్వకారణంగా ఉందని మంత్రి తలసాని అన్నారు. 70 ఏండ్లలో జరగని అభివృద్ధి 9 ఏళ్లలో జరిగిందన్నారు. దేశానికి తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తూ.. అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెడుతున్నామన్నారు. వ్యవసాయానికి ప్రతీకగా తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందన్నారు. కాళేశ్వరం నీళ్లతో మెదక్ జిల్లా సస్యశ్యామలం అవుతోందని... కేసీఆర్ ఆలోచనతో రైతు బంధు పథకం ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు పొందిందని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ వ్యాఖ్యానించారు.

Updated Date - 2023-06-02T10:37:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising