ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

మాజీ ఎమ్మెల్యే కుంజా సత్యవతి కన్నుమూత

ABN, First Publish Date - 2023-10-16T09:58:50+05:30

భద్రాచలంకు చెందిన మాజీ ఎమ్మెల్యే కుంజా సత్యవతి హఠాన్మరణం పాలయ్యారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ తరుఫున పోటీ చేసి సత్యవతి విజయం సాధించారు. తీవ్రమైన ఛాతినొప్పితో బాధపడుతున్న ఆమెను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు

భద్రాద్రి కొత్తగూడెం : భద్రాచలంకు చెందిన మాజీ ఎమ్మెల్యే కుంజా సత్యవతి హఠాన్మరణం పాలయ్యారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ తరుఫున పోటీ చేసి సత్యవతి విజయం సాధించారు. తీవ్రమైన ఛాతినొప్పితో బాధపడుతున్న ఆమెను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. కుంజా సత్యవతి మృతి పట్ల బీజేపీ నేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. సత్యవతి మృతిపట్ల కిషన్‌రెడ్డి, ఈటల సంతాపం తెలిపారు. అలాగే.. కాంగ్రెస్ నేతలు రేవంత్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు సంతాపం వ్యక్తం చేశారు.

కుంజా సత్యవతి దంపతులు మొదట్లో సీపీఎంలో ఉండేవారు. ఆ తర్వాత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చొరవతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో.. 2009 ఎన్నికల్లో భద్రాచలం నుంచి సత్యవతి కాంగ్రెస్ టికెట్‌పై గెలిచారు. ఆ తరువాత ఆమె బీజేపీలో చేరారు. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి ఆమెకు టికెట్‌ దక్కే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. ఇంతలోనే సత్యవతి హఠాన్మరణం ఆ పార్టీ నేతలకు షాకింగ్‌గా మారింది.

Updated Date - 2023-10-16T09:58:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising