ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kirankumar Reddy: సమయం, సందర్భం వచ్చినప్పుడు జగన్ పాలనపై స్పందిస్తా

ABN, First Publish Date - 2023-05-31T16:06:37+05:30

సమయం, సందర్భం వచ్చినప్పుడు జగన్ పాలనపై స్పందిస్తానని మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: సమయం, సందర్భం వచ్చినప్పుడు జగన్ పాలనపై స్పందిస్తానని మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి (Former Chief Minister Kirankumar Reddy) అన్నారు. బుధవారం మాజీ సీఎం కిరణ్‌తో ఏపీ బీజేపీ నేతలు (AP BJP Leaders) భేటీ అయ్యారు. అనంతరం కిరణ్ మాట్లాడుతూ.. ఏపీలో పనిచేయమంటే ఏపీలో.. తెలంగాణలో పనిచేయమంటే తెలంగాణలో పనిచేస్తానని మాజీ ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. జాతీయ నాయకత్వం ఎక్కడ పనిచేయమంటే అక్కడ పనిచేస్తానని తెలిపారు. ఏపీలో బీజేపీ బలోపేతం కోసం ఏవిధంగా ముందుకు వెళ్ళాలనే అంశంపై చర్చించామని చెప్పారు. తనకున్న అనుభవంతో పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తానన్నారు. బీజేపీలో చేరాక నెల రోజులు పాటు అమెరికా వెళ్ళానని.. ఇకపై పార్టీ కార్యక్రమాల్లో బిజీ అవుతానని కిరణ్‌ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. కిరణ్‌తో దాదాపు మూడున్నర గంటల పాటు ఏపీ బీజేపీ నేతల సమావేశం కొనసాగింది.

మర్యాద పూర్వకంగా కలిశా: సోమువీర్రాజు

కిరణ్ కుమార్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశామని ఏపీ బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు తెలిపారు. ఏపీ నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులను వివరించామన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి సలహాలు సూచనలుతో ఏపీలో ముందుకు వెళ్తామని తెలిపారు. పార్టీ బలోపేతానికి సంబంధించి కిరణ్ కుమార్ వద్ద మంచి కార్యాచరణ ఉందన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి మార్గనిర్దేశంలో ఏపీలో ముందుకు వెళ్తామని సోమువీర్రాజు తెలిపారు.

Updated Date - 2023-05-31T16:06:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising