Protest: నేడు ఇందిరా పార్క్ దగ్గర కాంగ్రెస్ ధర్నా
ABN, Publish Date - Dec 22 , 2023 | 07:27 AM
హైదరాబాద్: పార్లమెంట్లో ఎంపీల సస్పెన్షన్కు నిరసనగా శుక్రవారం ఇందిరా పార్క్ దగ్గర కాంగ్రెస్ ధర్నా నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పాల్గొననున్నారు.
హైదరాబాద్: పార్లమెంట్లో ఎంపీల సస్పెన్షన్కు నిరసనగా శుక్రవారం ఇందిరా పార్క్ దగ్గర కాంగ్రెస్ ధర్నా నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పాల్గొననున్నారు. ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ధర్నా చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇండియా కూటమి నేతృత్వంలో నిరసన కార్యక్రమాలు చేయనున్నారు. అలాగే పార్లమెంట్లో సెక్యూరిటీ లోపాలపై కూడా ఇండియా కూటమి నిరసన తెలియజేయనుంది.
కాగా శుక్రవారం సాయంత్రం ఎల్బీస్టేడియంలో క్రిస్టమస్ వేడుకలు ఘనంగా జరగనున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం క్రిస్టమస్ వేడుకలకు భారీ ఏర్పాట్లు చేసింది. ఈ వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు హాజరవుతారు.
Updated Date - Dec 22 , 2023 | 07:27 AM