ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Hyderabad: బీజేపీకి తలనొప్పిగా మారిన చేరికలు

ABN, First Publish Date - 2023-05-26T09:49:32+05:30

హైదరాబాద్: తెలంగాణ బీజేపీలో చేరికలు తలనొప్పిగా మారాయి. బీఆర్ఎస్ బహిష్కృత నాయకులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావుతో ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ జరిపిన చర్చలు ఫలించలేదు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణ బీజేపీలో చేరికలు తలనొప్పిగా మారాయి. బీఆర్ఎస్ బహిష్కృత నాయకులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Pongulati Srinivas reddy), జూపల్లి కృష్ణారావు (Jupally Krishna rao)తో ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ (Etala Rajender) జరిపిన చర్చలు ఫలించలేదు. దీంతో ఆ ఇద్దరూ ఏ పార్టీలో చేరతారనే అంశంపై సస్పెన్స్ కొనసాగుతోంది. నిన్న పొంగులేటి, జూపల్లిని కలసిన ఈటల.. బీజేపీలోకి ఆహ్వానించారు. అయితే బీజేపీలో చేరికపై వారు స్పష్టత ఇవ్వలేదు.

బీజేపీ నేతలతో మరోసారి సమావేశం కావాలని పొంగులేటి, జూపల్లి నిర్ణయించారు. రానున్న ఎన్నికల్లో బలమైన అభ్యర్థులను బరిలో నిలపాలనే పట్టుదలతో బీజేపీ నాయకత్వం ఉంది. దీంతో బీఆర్ఎస్, కాంగ్రెస్‌లో అసంతృప్తి నేతలే టార్గెట్‌గా బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. అయితే కర్ణాటక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో బీజేపీ ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయి.

ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, నగర్‌కర్నూలు జిల్లాకు చెందిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఏ పార్టీలో చేరబోతున్నారు?.. లేదా సొంతంగా పార్టీని స్థాపించబోతున్నారా? అనే చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో గురువారం కీలక పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్ శివార్లలో ఫామ్‌హౌస్‌లో ఈటల రాజేందర్, పొంగులే, జూపల్లి మధ్య రహస్య భేటీ జరిగింది. ఈటలకు చెందిన ఈ ఫామ్‌‌హౌస్‌లో దాదాపు 4 గంటలకుపైగా ఈ సమావేశం కొనసాగింది. అనుచరులు, అనుయాయులు, కనీసం సెక్యూరిటీ సిబ్బంది కూడా లేకుండా అత్యంత రహస్యంగా ఈ భేటీ జరిగింది.

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావులను బీజేపీలోకి తీసుకొచ్చేందుకు బీజేపీ నాయకత్వం పట్టువిడవకుండా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా గురువారం రహస్య భేటీకి కారణమనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఈటల రాజేందర్ నేతృత్వంలోని బీజేపీ చేరిక కమిటీ ఇదివరకే ఖమ్మం వెళ్లి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావులతో సంప్రదింపులు జరిపింది. అప్పుడు అందరి ముందు బహిరంగంగానే చర్చలు జరిగాయి. ఆలోచించుకుని తర్వాత నిర్ణయం చెబుతామని వారిద్దరూ స్పష్టం చేశారు. కానీ ప్రస్తుతం జరుగుతున్న సమావేశం అత్యంత రహస్యంగా జరుగుతుండడమే రాజకీయంగా ఆసక్తికలిగించడానికి కారణమవుతోంది. వారిద్దరినీ పార్టీలోకి ఆహ్వానించేందుకు ఈటల చర్చలు జరుపుతున్నారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. కానీ... పొంగులేటి, జూపల్లి కొత్త పార్టీ పెట్టబోతున్నారని, ఇందులో భాగంగానే ఈటలను రహస్యంగా కలిశా? అనే ఊహాగానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరి నిజంగా వీరిద్దరినీ ఈటల బీజేపీలోకి ఆహ్వానిస్తున్నారా? లేక ఈటలనే తమ కొత్త పార్టీలోకి ఆహ్వానించారా? అనే ఆసక్తికర విషయాలపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Updated Date - 2023-05-26T09:49:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising