Bandi Sanjay: కేసీఆర్కు బండి సంజయ్ లేఖ
ABN, First Publish Date - 2023-02-21T16:59:42+05:30
సీఎం కేసీఆర్ (CM KCR) కు బీజేపీ నేత బండి సంజయ్ (Bandi Sanjay) లేఖ రాశారు.
హైదరాబాద్: సీఎం కేసీఆర్ (CM KCR) కు బీజేపీ నేత బండి సంజయ్ (Bandi Sanjay) లేఖ రాశారు. ప్రమోషన్లు అడిగితే సస్పెండ్ చేస్తారా? అని ప్రశ్నించారు. మాతృభాషా దినోత్సవం రోజు.. భాషా పండితులకు ఇచ్చే కానుక ఇదేనా? అని లేఖ (letter)లో ప్రశ్నించారు. 22 ఏళ్లుగా ప్రమోషన్లు ఇవ్వకపోవడం ఏంటి?.. ప్రపంచ తెలుగు మహాసభల్లో ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? అని ప్రశ్నించారు. తక్షణమే భాషా పండితుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తక్షణమే పీఆర్సీ (PRC)ని ఏర్పాటు చేసి ఉద్యోగ, ఉపాధ్యాయులకు జులై 1 నుంచి జీతాలు చెల్లించాలని లేఖలో బండి సంజయ్ డిమాండ్ చేశారు.
Updated Date - 2023-02-21T16:59:43+05:30 IST