ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

CM KCR: యశోద ఆస్పత్రికి కేసీఆర్.. వైద్యులతో ఏం మాట్లాడారంటే..?

ABN, First Publish Date - 2023-10-30T20:52:16+05:30

సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం సూరంపల్లి గ్రామంలో సోమవారం ఉదయం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి‌ ( MP Kotta Prabhakar Reddy ) పై గటని రాజు అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు.

హైదరాబాద్: సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం సూరంపల్లి గ్రామంలో సోమవారం ఉదయం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి‌ ( MP Kotta Prabhakar Reddy ) పై గటని రాజు అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఎంపీ తీవ్రంగా గాయపడ్డారు. అయితే ప్రభాకర్ రెడ్డిని యశోద ఆస్పత్రికి తరలించారు. యశోద ఆస్పత్రిలో ప్రభాకర్ రెడ్డికి వైద్యులు శస్త్ర చికిత్స చేశారు. ఈ శస్త్ర చికిత్స చేయడం కొద్దిసేపటి క్రితం ముగిసింది. శస్త్ర చికిత్స అనంతరం మరి కాసేపట్లో ఐసీయూకి వైద్యులు మార్చనున్నారు. ఐసీయూలోనే కొత్త ప్రభాకర్ రెడ్డిని ఉంచి వైద్యులు పర్యవేక్షించనున్నారు. పేగుకి గాయం కావడంతో ఇన్ఫెక్షన్ సోకకుండా వైద్యులు చర్యలు తీసుకున్నారు.శాస్త్ర చికిత్స సమయంలో గాయం తీవ్రంగా ఉందని వైద్యులు గుర్తించారు. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడానికి ప్రగతి భవన్ నుంచి యశోద ఆస్పత్రికి సీఎం కేసీఆర్ వెళ్లి ప్రభాకర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

Updated Date - 2023-10-30T21:03:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising