ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Jayasudha: ఢిల్లీకి సినీనటి జయసుధ.. నేడే బీజేపీలో చేరిక

ABN, First Publish Date - 2023-08-02T10:43:30+05:30

సినీనటి, మాజీ ఎమ్మెల్యే జయసుధ బుధవారం ఉదయం ఢిల్లీకి చేరుకున్నారు. ఈరోజు జయసుధ కాషాయం తీర్థం పుచ్చుకోనున్నారు.

న్యూఢిల్లీ: సినీనటి, మాజీ ఎమ్మెల్యే జయసుధ (Actress, Former MLA Jayasudha) బుధవారం ఉదయం ఢిల్లీకి చేరుకున్నారు. ఈరోజు జయసుధ కాషాయం తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ క్రమంలో జయసుధ దేశరాజధానికి చేరుకున్నారు. ఢిల్లీలోని బీజేపీ హెడ్‌క్వార్టర్స్‌లో ఈరోజు సాయంత్రం ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (BJP National President JP Nadda) సమక్షంలో మధ్యాహ్నం జయసుధ కాషాయి కండువా కప్పుకోనున్నారు. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షులు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి (Union Minister Kishan Reddy), ఎంపీ లక్ష్మణ్ (MP Laxman) ఇప్పటికే ఢిల్లీలో ఉన్నారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శులు సునీల్ బన్సల్ (Sunil Bansal), బండి సంజయ్ (Bandi Sanjay) తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. 2009లో కాంగ్రెస్ నుంచి సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా జయసుధ విజయం సాధించారు. అయితే గతంలో సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన జయసుధ.. ఇప్పుడు ముషీరాబాద్ లేదా సికింద్రాబాద్ టికెట్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. మరి బీజేపీ పెద్దలు జయసుధకు ఎలాంటి హామీ ఇవ్వనున్నారో చూడాలి.

Updated Date - 2023-08-02T10:43:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising