ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

JP Nadda: జేపీ నడ్డా తెలంగాణ పర్యటనలో స్వల్ప మార్పు

ABN, First Publish Date - 2023-03-30T22:45:04+05:30

JP Nadda: జేపీ నడ్డా తెలంగాణ పర్యటనలో స్వల్ప మార్పు A slight change in JP Nadda's visit to Telangana

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

హైదరాబాద్(Hyderabad): భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు జగత్ ప్రకాశ్ నడ్డా (Jagat Prakash Nadda) పర్యటనలో స్వల్ప మార్పు చోటు చేసుకుంది. సంగారెడ్డి(Sangareddy)లో నిర్మించిన బీజేపీ(BJP) జిల్లా కార్యాలయాన్ని ఢిల్లీ(Delhi) నుంచే వర్చువల్‌గా ప్రారంభిస్తారని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి(Gujjula Premender Reddy) ఓ ప్రకటనలో తెలిపారు. అక్కడి నుంచే కార్యకర్తలను ఉద్దేశించి జేపీ నడ్డా ప్రసంగించనున్నారు. అలాగే భూపాలపల్లి, వరంగల్, జనగామ, మహబూబాబాద్ జిల్లాలతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపూర్, చిత్తూరు జిల్లాల్లో నూతనంగా నిర్మించిన పార్టీ కార్యాలయాలను సైతం జేపీ నడ్డా వర్చువల్‌గా ప్రారంభించనున్నారు.

సంగారెడ్డిలో జరిగే కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్‌తోపాటు కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె.లక్ష్మణ్, సంస్థాగత జాతీయ సహ ప్రధాన కార్యదర్శి శివప్రకాశ్ జీ, జాతీయ ప్రధాన కార్యదర్శులు తరుణ్ చుగ్, సునీల్ బన్సల్, తెలంగాణ సహ ఇన్‌చార్జి అరవింద్ మీనన్ హాజరవుతారని ప్రకటనలో గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి తెలిపారు. అనంతరం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సాయంత్రం 5.30 గంటలకు యధావిధిగా రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, జిల్లా ఇన్‌చార్జుల సమావేశం జరుగుతుంది.ఈ నేపథ్యంలోఆయా కార్యక్రమాలకు హాజరై విజయవంతం చేయాలని సంబంధిత నాయకులు, కార్యకర్తలను పార్టీ అధిష్ఠానం పిలిపిచ్చింది.

Updated Date - 2023-03-30T22:45:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising