ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

WTC Final: టీమిండియా ఓటమి... ఆస్ట్రేలియాదే డబ్ల్యూటీసీ ట్రోఫీ

ABN, First Publish Date - 2023-06-11T17:11:47+05:30

డబ్ల్యూటీసీ ట్రోఫీని ముద్దాడాలనే భారత్ కల మరోసారి చెదిరింది. డబ్ల్యూటీసీ ఫైనల్ (WTC Final) మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఘనవిజయం సాధించింది. టీమిండియా 209 పరుగుల ఘోర ఓటమిని మూటగట్టుకుంది. ఐదో రోజు తొలి సెషన్‌లో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీం ఇండియా వరుసగా వికెట్లను కోల్పోయింది. కనీసం పోరాట ప్రయత్నం కూడా చేయకుండానే ఆస్ట్రేలియాకు విజయాన్ని కట్టబెట్టింది. భారత బ్యాట్స్‌మెన్ అద్భుతం ఏమైనా చేస్తారా అని ఎదురుచూసినప్పటికీ ఏమాత్రం పోరాటం కూడా లేకుండా రెండో ఇన్నింగ్స్ 234 పరుగులకే ఆలౌట్ అయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లండన్: డబ్ల్యూటీసీ ట్రోఫీని ముద్దాడాలనే భారత్ కల మరోసారి చెదిరింది. డబ్ల్యూటీసీ ఫైనల్ (WTC Final) మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఘనవిజయం సాధించింది. టీమిండియా 209 పరుగుల ఘోర ఓటమిని మూటగట్టుకుంది. ఐదో రోజు తొలి సెషన్‌లో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీం ఇండియా వరుసగా వికెట్లను కోల్పోయింది. కనీసం పోరాట ప్రయత్నం కూడా చేయకుండానే ఆస్ట్రేలియాకు విజయాన్ని కట్టబెట్టింది. భారత బ్యాట్స్‌మెన్ అద్భుతం ఏమైనా చేస్తారా అని ఎదురుచూసినప్పటికీ ఏమాత్రం పోరాటం కూడా లేకుండా రెండో ఇన్నింగ్స్ 234 పరుగులకే ఆలౌట్ అయ్యారు.

ఐదో రోజు తొలి సెషన్ ఆరంభంలోనే విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా రూపంలో 4, 5 వికెట్లు కోల్పోగా.. ఆ తర్వాత అజింక్యా రహానే 46 పరుగులు చేసి స్టార్క్ బౌలింగ్‌లో అలెక్స్ కారీకి క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తర్వాత టైలెండర్లు త్వరత్వరగానే వికెట్లు కోల్పోయారు. కాగా కోహ్లీ 78 బంతుల్లో 49 పరుగులు చేసి ఆసీస్ బౌలర్ బోలాండ్ బౌలింగ్‌లో స్టీవెన్ స్మిత్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. రవీంద్ర జడేజా 2 బంతులు ఆడి స్కోర్ ఏం చేయకుండానే బోలాండ్ బౌలింగ్‌లో అలెక్స్ కారీకి క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. కీలకమైన రెండు వికెట్లను పడగొట్టి భారత జట్టు ఓటమి, ఆసీస్ విజయంలో బోలాండ్ కీలక పాత్ర పోషించాడు. కాగా ఈ మ్యాచ్‌లో అద్భుత బ్యాటింగ్‌తో రాణించిన ట్రావిస్ హెడ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ దక్కింది.

కాగా.. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా ఆస్ట్రేలియాకు బ్యాటింగ్ అప్పగించింది. భారత బౌలర్లు తేలిపోవడంతో మొదటి ఇన్నింగ్స్‌లో ఆసీస్ ఏకంగా 469 పరుగులు చేసింది. అయితే భారత బౌలర్లలో అజింక్యా రహానే మినహా ఎవరూ పెద్దగా రాణించకపోవడంతో భారత్ 296 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఇంకా 173 పరుగులు వెనుకబడింది. ఇక ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లోనూ భారీ స్కోరు చేసింది. 8 వికెట్ల నష్టానికి 270 పరుగులు చేశాక ఇన్నింగ్స్ డిక్లేర్ చేస్తున్నట్టు ప్రకటించింది. దీంతో 444 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. భారీ టార్గెట్‌తో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ కేవలం 234 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఫలితంగా ఆస్ట్రేలియా 209 పరుగుల ఘనవిజయాన్ని సొంతం చేసుకుని డబ్ల్యూటీసీ ట్రోఫీని ముద్దాడింది.

Updated Date - 2023-06-11T17:37:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising