ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

WTC Final: వరుసగా రెండు వికెట్లు.. కష్టాల్లో టీం ఇండియా

ABN, First Publish Date - 2023-06-10T21:25:58+05:30

డబ్ల్యూటీసీ ఫైనల్ (WTC Final) మ్యాచ్‌లో నాలుగో రోజు మూడో సెషన్‌లో భారత జట్టుకు ఎదురు దెబ్బ తగిలింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లండన్: డబ్ల్యూటీసీ ఫైనల్ (WTC Final) మ్యాచ్‌లో నాలుగో రోజు మూడో సెషన్‌లో భారత జట్టుకు ఎదురు దెబ్బ తగిలింది. వరుసగా రెండు ఓవర్లలోనే రోహిత్ శర్మ, పుజారా ఔటయ్యారు. భారత్ 19.5 ఓవర్ వద్ద 2వ వికెట్, 20.4 ఓవర్ వద్ద 3వ వికెట్ కోల్పోయింది. రోహిత్ శర్మ 60 బంతుల్లో 43 పరుగులు చేసి నాథన్ లైయన్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.

పుజారా 47 బంతుల్లో 27 పరుగులు చేసి కమిన్స్ బౌలింగ్‌లో అలెక్స్ కారీకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 7.1 ఓవర్లలో భారత్ 41 పరుగులు చేసి తొలి వికెట్ కోల్పోయింది. 19 బంతుల్లో 18 పరుగులు చేసిన శుభమాన్ గిల్ బోలాండ్ బౌలింగ్‌లో కామెరూన్ గ్రీన్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ప్రస్తుతం టీం ఇండియా 23 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 101 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ, రహానే క్రీజులో ఉన్నారు.

రెండో సెషన్‌లో డిక్లేర్డ్ చేసిన ఆస్ట్రేలియా భారత్ ముందు ఆస్ట్రేలియా 444 పరుగుల భారీ విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. 445 పరుగుల విజయ లక్ష్యాన్ని చేరుకోవాలంటే టీం ఇండియా బ్యాటర్లు భారీ స్థాయిలో పరుగులు చేయాల్సి ఉంటుంది.

ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 270-8 వద్ద డిక్లేర్డ్ చేసింది. తొలి ఇన్సింగ్స్‌లో ఆస్ట్రేలియా 469 పరుగులు చేయగా, తొలి ఇన్సింగ్స్‌లో టీం ఇండియా 296 పరుగులు చేసింది.

Updated Date - 2023-06-10T21:28:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising