ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వామ్మో.. నిప్పులపై నడిపించి మరీ ఇంటి కోడలికి అగ్నిపరీక్ష.. అసలేం జరిగిందంటే..

ABN, First Publish Date - 2023-03-26T18:58:18+05:30

ఎప్పుడో సీతమ్మ కాలం నాటి అగ్నిపరీక్ష మళ్ళీ ఇప్పుడు ఇలా.. ఓ ఆడపిల్ల జీవితంలో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

రామాయణంలో సీతమ్మ అగ్నిపరీక్ష గురించి మనకు తెలిసిందే.. ఇప్పటికాలంలో ఇలాంటివి జరగడం ఎక్కడా చూసుండరు, కనీసం వినను కూడా విని ఉండరు. కానీ ఓ మహిళకు అత్తింటివారు అగ్నిపరీక్ష పెట్టారు. పాపం ఎర్రగా మండుతున్న నిప్పులలో నడిపించారు. బాధితురాలు భర్త దగ్గరకు వెళ్ళి తన బాధ చెప్పుకుని భోరుమంది. ఆ తరువాత అసలు నిజం బయటకు వచ్చింది. ఈ సంఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళితే..

ఛత్తీస్ ఘర్(Chhattisgarh) రాష్ట్రం కోట(Kota) జిల్లాలో పుల్గావ్(Pulgaon) అనే గ్రామముంది. ఈ గ్రామానికి చెందిన వ్యక్తితో మమత అనే మహిళకు పెళ్ళి జరిగింది. అత్త,మామ,బావ,తోడికోడలుతో కలిసే ఉంటున్నారు వారు. మమత భర్త ఇంట్లో లేని సమయంలో కుటుంబ సభ్యులు మమతతో 'నువ్వు చిక్కిపోతున్నావు, నీకు ఎవరో చేతబడి చేశారు' అని చెప్పారు. 'మాకు తెలిసిన ఒక మాంత్రికుడు ఉన్నాడు. అక్కడికెళ్ళి నీ సమస్యను పరిష్కరిద్దాం' అని మమతను వెంటబెట్టుకుని ఒక కుర్రాడి దగ్గరకు వెళ్ళారు. చాలా చిన్న వయసున్న ఆ కుర్రాడు 'ఈమెకు చేతబడి ఉందో లేదో తెలుసుకోవాలంటే అగ్నిపరీక్ష పెట్టాలి'అని చెప్పాడు. మమత అందుకు ఒప్పుకోకపోయినా కుటుంబ సభ్యులు అందరూ కలసి ఆమె మీద ఒత్తిడి తెచ్చారు. మమత పారిపోవాలని ప్రయత్నించింది.. కానీ ఆమెను గట్టిగా పట్టుకుని నిర్బంధించారు. దీంతో ఏమీ చెయ్యలేక మమత నిస్సహాయంగా ఉండిపోయింది. వెంటనే మమత అగ్నిపరీక్షకు ఏర్పాటు చేసి మండుతున్న నిప్పుల్లో నడిపించారు. దీంతో మమతకు చాలా గాయాలు అయ్యాయి. అక్కడున్న అందరినీ తోసుకుంటూ ఒక్కసారిగా పరిగెత్తి ఇంటికి వెళ్లిపోయింది.

Read also: Super Foods: వామ్మో.. మనం రోజూ సూపర్ ఫుడ్ అనుకుని తింటున్న వీటితో ఇంత డేెంజరా? అవేంటో తెలిస్తే విస్తుపోతారు..


మమత భర్త ఇంటికి తిరిగి రాగానే భోరున ఏడుస్తూ జరిగిన విషయమంతా భర్తకు చెప్పింది. భర్త ఆమెను ఓదార్చి ఆమెను తీసుకుని పోలిస్ స్టేషన్ కు వెళ్ళాడు. అక్కడ పోలీసులకు జరిగిన విషయం మొత్తం చెప్పి 'మూఢనమ్మకాలతో అందరినీ తప్పుదోవ పట్టిస్తున్న మాంత్రికుడిని అరెస్ట్ చెయ్యండి' అని ఫిర్యాదు చేశాడు. కాగా మమత బావ, తోడికోడలు, అత్తామామలు మమత మీద హింసకు పాల్పడ్డారని, వారు కావాలనే ఇలా చేశారని మమత ఆరోపించింది. దీంతో మమత తోడికోడలు, బావ, అత్తలను పోలీసులు అరెస్టు చేశారు. వారు ఎందుకు అలా చేయించారో, వారి ఉద్దేశమేమిటో కనుక్కుంటామని పోలీసులు చెప్పారు. ప్రస్తుతం కేసు విచారణ జరుగుతోంది.

Read also: Viral Video: ఇనుప కంచెలో ఇరుక్కుపోయిన జింకను కాపాడాడొక వ్యక్తి.. ఆ తరువాత జింక ఏం చేసిందో చూస్తే షాకవుతారు..


Updated Date - 2023-03-26T18:58:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising