Ooty: ఊటీ కొండ రైలు సర్వీసు ప్రారంభం
ABN, Publish Date - Dec 24 , 2023 | 09:26 AM
మేట్టుపాళయం - ఊటీ కొండ రైలు సేవలు ప్రారంభమయ్యాయి. మేట్టుపాళయం రైల్వేస్టేషన్ నుంచి ఊటీకి ప్రతిరోజు నడిచే ఈ రైలులో ప్రయాణించేందుకు పర్యాటకులు ఆసక్తి చూపు తున్నారు.
ఐసిఎఫ్(చెన్నై): మేట్టుపాళయం - ఊటీ కొండ రైలు సేవలు ప్రారంభమయ్యాయి. మేట్టుపాళయం రైల్వేస్టేషన్ నుంచి ఊటీకి ప్రతిరోజు నడిచే ఈ రైలులో ప్రయాణించేందుకు పర్యాటకులు ఆసక్తి చూపుతున్నారు. గత నవంబరులో కురిసిన భారీవర్షాలకు మట్టి చరియలు విరిగి ఏర్పడి 22వ తేది రైలు సేవలు నిలిపివేశారు. 22 రోజుల అనంతరం ఈనెల14వ తేది యథావిధిగా సేవలు కొనసాగాయి. ఈనెల 20వ తేది కున్నూర్-మేట్టుపాళయం కొండ మార్గంలో అటర్లీ-హిల్ గ్రోవ్ వద్ద బండరాళ్లు విరిగి పడడంతో మూడు రోజులు సేవలు రద్దయ్యాయి. శనివారం ఉదయం 7.10 గంటలకు రైలు సేవలు పునఃప్రారంభం కావడంతో పర్యాటకులు హర్షం వ్యక్తం చేశారు.
Updated Date - Dec 24 , 2023 | 09:26 AM