ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Wife Kills Husband: భర్తను చంపి, ఐదు ముక్కలుగా నరికిన భార్య.. కారణం ఏంటో తెలుసా?

ABN, First Publish Date - 2023-07-28T19:15:38+05:30

ఉత్తరప్రదేశ్‌లో ఒళ్లుగగుర్పొడిచే దారుణ సంఘటన వెలుగు చూసింది. ఒక మహిళ తన భర్తని గొడ్డలితో నరికి చంపి, ఆపై మృతదేహాన్ని ఐదు ముక్కలుగా..

ఉత్తరప్రదేశ్‌లో ఒళ్లుగగుర్పొడిచే దారుణ సంఘటన వెలుగు చూసింది. ఒక మహిళ తన భర్తని గొడ్డలితో నరికి చంపి, ఆపై మృతదేహాన్ని ఐదు ముక్కలుగా నరికింది. బాడీ పార్ట్స్‌ని దగ్గరలోని చెరువులో పారేసి, తన భర్త కనిపించడం లేదంటూ కొత్త నాటకానికి తెరలేపింది. చివరికి ఈ హత్య చేసింది భార్యేనని తేల్చి, పోలీసులు ఆమెని అరెస్ట్ చేశారు. అసలు ఆ మహిళ ఈ దారుణానికి ఎందుకు ఒడిగట్టిందో తెలుసా? పరాయి మగాడి కోసం! తన భర్త స్నేహితుడితోనే వివాహేతర సంబంధం పెట్టుకున్న ఆమె.. తన బంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని, ఇలా కిరాతకంగా చంపేసింది. ఆ వివరాల్లోకి వెళ్తే..

పిలిభిత్ జిల్లాలోని శివ్‌నగర్‌లో రామ్‌పాల్ (55) తన భార్య దులారో దేవితో కలిసి నివసిస్తున్నాడు. వీరికి ఒక కొడుకు ఉన్నాడు. అతనికి పెళ్లై, పిల్లలున్నారు. తల్లిదండ్రుల ఇంటికి కొంత దూరంలోనే సెపరేట్‌గా కాపురం పెట్టాడు. కట్ చేస్తే.. రామ్‌పాల్ స్నేహితుడొకడు తరచూ అతనికి ఇంటికి వచ్చేవాడు. ఈ క్రమంలోనే అతనికి, దులారో దేవికి వివాహేతర సంబంధం ఏర్పడింది. తన ప్రియుడితోనే కలిసి ఉండాలని నిర్ణయించుకొని, అతనితో కలిసి వెళ్లిపోయింది. కొన్ని రోజులు ప్రియుడితో సహజీవనం చేసిన తర్వాత దులారో దేవి తిరిగి భర్త వద్దకు వచ్చేసింది. ఆమె చేసిన తప్పుకి భర్త క్షమించి, ఇక నుంచైనా చక్కగా కాపురం చేసుకోమని చెప్పాడు.


కొన్ని రోజులు గడిచాక.. దులారో దేవి పరిగెత్తుకుంటూ తన కొడుకు వద్దకు వెళ్లి, ‘మీ నాన్న కనిపించడం లేదు’ అని చెప్పింది. ఇద్దరు కలిసి రామ్‌పాల్ కోసం వెతికారు. ఎక్కడా ఆచూకీ దొరక్కపోవడంతో.. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తొలుత మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అయితే.. దులారో దేవి పొంతన లేని సమాధానాలు ఇస్తుండటంతో, ఆమెపై అనుమానం వచ్చి అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో ఆమెని విచారించగా.. అప్పుడు అసలు నిజం కక్కింది. తానే తన భర్తని హతమార్చానని అంగీకరించింది. ఆదివారం రాత్రి రామ్‌పాల్ నిద్రలో ఉన్నప్పుడు, అతడ్ని చంపానని తెలిపింది.

అంతేకాదు.. రామ్‌పాల్ శరీరాన్ని ఐదు ముక్కలుగా నరికి, ఆ బాడీ పార్ట్స్‌ని దగ్గరలో ఉన్న చెరువులో పారేశానని దులారో దేవి చెప్పింది. ఆమె ఇచ్చిన సమాచారం మేరకు.. రామ్‌పాల్ శరీర భాగాల్ని చెరువులో నుంచి వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నారు. రామ్‌పాల్ స్నేహితుడితో తనకు వివాహేతర సంబంధం ఉందని, అతనితో జీవితాంతం కలిసి ఉండేందుకే.. అడ్డుగా ఉన్న తన భర్తని హతమార్చానని చెప్పుకొచ్చింది.

Updated Date - 2023-07-28T19:15:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising