Train Accident : రైలు ప్రమాదంలో మృతి చెందిన వారి వివరాలేంటంటే..
ABN, First Publish Date - 2023-10-30T10:26:23+05:30
కోరమాండల్ ఎక్స్ప్రెస్ ఘోరాన్ని మరచిపోకముందే... మరో రైలు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న ప్యాసింజర్ను... అదే పట్టాలపై వచ్చిన మరో ప్యాసింజర్ రైలు వెనుక నుంచి ఢీకొట్టింది.
విజయనగరం : కోరమాండల్ ఎక్స్ప్రెస్ ఘోరాన్ని మరచిపోకముందే... మరో రైలు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న ప్యాసింజర్ను... అదే పట్టాలపై వచ్చిన మరో ప్యాసింజర్ రైలు వెనుక నుంచి ఢీకొట్టింది. విజయనగరం జిల్లా అలమండ- కంటకాపల్లి స్టేషన్ల మధ్య జరిగిన ఈ దుర్ఘటనలో 11 మంది దుర్మరణం పాలయ్యారు. 60 మందికిపైగా ప్రయాణికులు గాయపడ్డారు. తొలుత ఆరుతో మొదలైన మృతుల సంఖ్య... సమయం గడిచేకొద్దీ పెరుగుతూ పోయింది. సంఘటన స్థలం వద్ద నెలకొన్న పరిస్థితులు, క్షతగాత్రుల సంఖ్యను చూస్తే... మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.కాగా.. ఈ రైలు ప్రమాదంలో మృతి చెందిన వారి వివరాలను అధికారులు వెలువరించారు. మొత్తంగా 11 మందితో కూడా లిస్ట్ను విడుదల చేశారు.
Updated Date - 2023-10-30T10:26:23+05:30 IST