ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Gadde Rammohan: జగన్ ఇచ్చిన హామీలకు.. చేసే పనులకు పొంతనే లేదు

ABN, First Publish Date - 2023-06-02T14:56:54+05:30

జగన్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు, నేడు చేసే పనులకు పొంతనే లేదని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: జగన్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు, నేడు చేసే పనులకు పొంతనే లేదని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ (MLa Gadde Rammohan) అన్నారు. శుక్రవారం తూర్పు నియోజకవర్గంలో 500 మంది నాయకులతో ఎమ్మెల్యే సమావేశమయ్యారు. చంద్రన్న సారధ్యంలో జరిగిన అభివృద్ది.. జగన్ పాలనలో జరిగిన అవినీతిపై ప్రజలకు వివరించేలా కార్యాచరణ రూపొందించారు. టీడీపీ మ్యానిఫెస్టోతో పాటు, జగన్ (AP CM YS Jaganmohan Reddy) హామీలు అమలు చేయకుండా మోసం చేసిన అంశాలపై కరపత్రాల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించేలా తూర్పు నియోజకవర్గంలో ఇంటింటికీ వెళ్లే కార్యక్రమం చేపట్టామన్నారు. అమ్మ ఒడిపై గొప్పలు చెప్పుకుంటున్న జగన్ మాట తప్పడం నిజం కాదా అని ప్రశ్నించారు. ప్రతి ఇంట్లో ఉన్న బిడ్డలకు అమ్మఒడి అని చెప్పి.. ఒక్కరికే పరిమితం చేశారన్నారు. చంద్రబాబు (TDP Chief Chandrababu Naidu) పెంచిన పెన్షన్‌ను రెండు వేల నుంచి మూడు వేలు చేస్తామన్నారని.. జగన్ నాలుగేళ్లుగా పెన్షన్ పెంచకుండా మోసం చేయడం వాస్తవం కాదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రకటించిన మ్యానిఫెస్టోపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. వీటన్నింటిపైనా అవగాహన కల్పించేలా ఐదు వందల మంది నాయకులతో సమావేశం పెట్టామని తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న దారుణ పాలన, జగన్ అవినీతి, అక్రమాలను ప్రజలకు వివరిస్తామని ఎమ్మెల్యే గద్దెరామ్మోహన్ తెలిపారు.

Updated Date - 2023-06-02T14:56:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising