Devathoti Nagaraju: జవాబుదారీతనం నాయకుడు లోకేష్...
ABN, First Publish Date - 2023-12-11T09:57:28+05:30
Andhrapradesh: టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర మూడువేల కిలోమీటర్లు పూర్తి అయ్యింది.
అమరావతి: టీడీపీ యువనేత నారా లోకేష్ (TDP Leader Nara Lokesh) యువగళం పాదయాత్ర (YuvaGalam Padayatra) మూడువేల కిలోమీటర్లు పూర్తి అయ్యింది. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దేవతోటి నాగరాజు మాట్లాడుతూ... ‘‘ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఎన్ని అడ్డంకులు అవాంతరాలు ఎదురైనా మొక్కవోని దీక్షతో లోకేష్ బాబు మూడువేల కిలోమీటర్ల పాదయాత్రను పూర్తి చేశారు. నేటితరం రాజకీయాలలో అత్యంత నిబద్ధత జవాబుదారితనం గల నాయకుడు లోకేష్ మాత్రమే. పాదయాత్రలో ప్రజల కష్టసుఖాలను సమస్యలను సావధానంగా విని చూసిన లోకేష్ ఆంధ్రప్రదేశ్ను తిరిగి నవ్యాంధ్రగా మార్చడంలో కీలక పాత్ర పోషించబోతున్నారు’’ అంటూ దేవతోటి నాగరాజు పేర్కొన్నారు.
Updated Date - 2023-12-11T09:57:30+05:30 IST