ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Atchannaidu: జగన్ రక్తదాహానికి ఎంతమంది టీడీపీ నేతలు బలికావాలి?..

ABN, First Publish Date - 2023-02-02T16:35:49+05:30

ఏపీ ముఖ్యమంత్రి జగన్ (CM Jagan) రక్తదాహానికి ఎంతమంది టీడీపీ నేతలు (TDP Leaders) బలికావాలని తెలుగుదేశంపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (Atchannaidu) ప్రశ్నించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి జగన్ (CM Jagan) రక్తదాహానికి ఎంతమంది టీడీపీ నేతలు (TDP Leaders) బలికావాలని తెలుగుదేశంపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (Atchannaidu) ప్రశ్నించారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ పల్నాడు (Palnadu)ను వల్లకాడు చేస్తున్నారని మండిపడ్డారు. రొంపిచర్ల టీడీపీ అధ్యక్షుడు వెన్నా బాలకోటిరెడ్డి (Balakotireddy)పై హత్యాయత్నానికి వైసీపీ నేతలు (YCP Leaders) తెగబడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. స్థానిక ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి (Gopireddy Srinivasa Reddy) కనుసన్నల్లోనే కాల్పులు జరిగాయని విమర్శించారు. బాలకోటిరెడ్డిపై దాడి జరగడం ఇది రెండోసారని, అయినా జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో పోలీసులు విఫలమయ్యారని ఆరోపించారు. మొదటిసారి దాడికి పాల్పడిన వెంకటేశ్వర్ రెడ్డికి ఎమ్మెల్యే గోపిరెడ్డి ఆశ్రయమిచ్చారని, నిందితులను తక్షణమే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.

నరసరావుపేట నియోజకవర్గంలో టీడీపీ నేతపై కాల్పులు (Firing on TDP leader) జరపడం కలకలం రేపింది. రొంపిచెర్ల మండల టీడీపీ అధ్యక్షుడు వెన్నా బాలకోటిరెడ్డిపై వైసీపీ నేతలు కాల్పులు జరిపారు. గత రాత్రి ఇంట్లో నిద్రిస్తున్నఆయనను బయటకు పిలిచి మరీ పిస్టల్‌తో కాల్చారు. వైసీపీ నేత పమ్మి వెంకటేశ్వర రెడ్డి, ఎంపీపీ భర్త గడ్డం వెంకట్రావు, పూజల రాముడు కాల్పులకు పాల్పడ్డారు. కాల్పులతో బాలకోటిరెడ్డి కుటుంబసభ్యులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. తీవ్రంగా గాయపడిన ఆయనను హుటాహుటిన నరసరావుపేట ఆసుపత్రికి తరలించారు. టీడీపీ ప్రభుత్వంలో బాల కోటిరెడ్డి రొంపిచెర్ల ఎంపీపీగా పని చేశారు. బాలకోటిరెడ్డిపై హత్యాయత్నం జరగడం ఇది రెండో సారి. కొద్ది నెలల క్రితమే ఆయనపై పలువురు వైసీపీ కార్యకర్తలు కత్తులతో దాడి చేయడంతో గాయపడి ప్రాణాలతో బయటపడ్డాడు. తాజాగా స్వగ్రామం అలవాలలో మరోసారి కాల్పులతో హత్యాప్రయత్నం చేశారు. విషయం తెలిసిన వెంటనే నరసరావుపేట టీడీపీ ఇన్‌చార్జ్ అరవింద్ బాబు ఆస్పత్రికి చేరుకుని బాలకోటిరెడ్డి పరామర్శించి దగ్గరుండి వైద్య సేవలను పర్యవేక్షిస్తున్నారు.

ఈ సందర్బంగా అరవింద్ బాబు (Chadalavada ArvindBabu) గురువారం ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి (ABN Andhrajyothy)తో మాట్లాడుతూ.... ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నర్సరావుపేట (Narsaraopet)కు గన్ కల్చర్ (Gun Culture) తీసుకొచ్చారని ఆరోపించారు. బాలకోటి రెడ్డి పై రెండోసారి హత్యాయత్నం జరిగిందని తెలిపారు. ఎమ్మెల్యే గోపిరెడ్డి కనుసన్నల్లోనే దాడులు జరుగుతున్నాయన్నారు. నరసరావుపేట ఎస్పీ ఉన్నప్పటికీ హత్యలు, దాడులు జరుగుతున్నాయని మండిపడ్డారు. ఇటీవల ఇబ్రహీం హత్య జరిగిందని... తాజాగా బాలకోటి రెడ్డిపై హత్య ప్రయత్నం చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. బాలకోటిరెడ్డి బలమైన టీడీపీ నేత అని తెలిపారు. గతంలో టీడీపీ నేతపై దాడి చేసిన తర్వాత వెంకటేశ్వరెడ్డికి ఎమ్మెల్యే గోపిరెడ్డే ఆశ్రయం ఇచ్చారని... దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయన్నారు. బాలకోటి రెడ్డిపై దాడి చేసిన వెంకటేశ్వర రెడ్డి, రాముడు, గడ్డం వెంకట్రావులు ఎమ్మెల్యే గోపిరెడ్డి అనుచరులే అని అరవింద్ బాబు ఆరోపించారు.

Updated Date - 2023-02-02T16:35:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising