ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Shilpa Chakrapani Reddy: రైతులతో శిల్పాచక్రపాణిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2023-01-27T18:12:51+05:30

రైతులతో ఎమ్మెల్యే శిల్పాచక్రపాణిరెడ్డి (Shilpa Chakrapani Reddy) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వెలుగోడు మండలం రేగడగూడూరులో రైతులు ఎమ్మెల్యేను కలిశారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నంద్యాల: రైతులతో ఎమ్మెల్యే శిల్పాచక్రపాణిరెడ్డి (Shilpa Chakrapani Reddy) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వెలుగోడు మండలం రేగడగూడూరులో రైతులు ఎమ్మెల్యేను కలిశారు. రబీలో తెలుగుగంగ (Telugu Ganga) ఆయకట్టుకు సాగునీరు అందించాలని రైతులు కోరారు. ‘అధికారులు ఎటైనా వెళ్తారు.. మీ చావు మీరు చావండి’ అని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. శిల్పా వ్యాఖ్యలపై రైతులు (farmers), రైతు సంఘాలు మండిపడుతున్నాయి. సామాజిక మాధ్యమాల్లో శిల్పాచక్రపాణిరెడ్డి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

తెలుగుగంగ, కేసీ కెనాల్‌ ఆయకట్టు రైతుల నిరసన ఉధృతం అయింది. రబీ సీజనలో తెలుగుగంగ ఆయకట్టు పంటల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారుతోంది. తెలుగుగంగ కాల్వ లైనింగ్‌ పనులు చేపట్టేందుకు వీలుగా ఫిబ్రవరి 15 వరకే పంటలకు నీరు ఇస్తామని కలెక్టర్‌ ప్రకటించారు. దీంతో వెలుగోడు, మహానంది, బండి ఆత్మకూరు మండలాల్లో పంటలు సాగు చేసిన రైతులు ఆందోళన బాట పట్టారు. బాధిత రైతులకు శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి (Budda Rajasekhara Reddy) మద్దతుగా నిలిచారు. రైతులు ఉద్యమానికి టీడీపీ కూడా మద్దతు ప్రకటించింది.

Updated Date - 2023-01-27T18:12:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising