ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Vijayawadaలో దేవినేని అవినాష్‌కు చేదు అనుభవం

ABN, First Publish Date - 2023-01-10T11:27:27+05:30

విజయవాడ (Vijayawada) తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జ్ దేవినేని అవినాష్‌ (Devineni Avinash)కు చేదు అనుభవం ఎదురైంది. కృష్ణలంక రాణి గారి తోటలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో దేవినేని అవినాష్‌ను మహిళలు

మహిళలు నిలదీత
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: విజయవాడ (Vijayawada) తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జ్ దేవినేని అవినాష్‌ (Devineni Avinash)కు చేదు అనుభవం ఎదురైంది. కృష్ణలంక రాణి గారి తోటలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో దేవినేని అవినాష్‌ను మహిళలు అడ్డుకున్నారు. ‘‘పని చేసిన వాళ్ల జెండాలను మా ఇళ్లపై పెట్టుకుంటాం అందుకే తెలుగుదేశం (TDP) జెండాను మా ఇళ్లపై పెట్టుకున్నాం. మీకోసం పనిచేశాం మీరు మాకు ఏం చేశారు. మమ్మల్ని మోసం చేశారంటూ’’ అవినాష్‌ను పలువురు మహిళలు నిలదీశారు. తాను ఒంటరి మహిళనని పింఛన్ (Pension) రాయమన్నా.. ఇల్లు రాయమన్నా.. వాలంటీర్ శాంతారెడ్డి డబ్బులు ఇస్తేనే రాస్తానని చెబుతుందని స్థానిక మహిళలు అవినాష్ ముందు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కసారిగా మహిళలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో వైసీపీ నాయకులు ఖంగుతున్నారు. స్థానిక వైసీపీ కార్పొరేటర్ రామిరెడ్డి (YCP Corporator Ramireddy) మమ్మల్ని మోసం చేశారంటూ రామిరెడ్డిని చూపిస్తూ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంఘటనతో దేవినేని అవినాష్ మౌనంగా ఉండిపోయారు. చివరకు వైసీపీ నేతలు మహిళలకు సర్ది చెప్పి ఏ సమస్య ఉన్న ఇకపై పరిష్కరిస్తానని చెప్పి ఎక్కడి నుంచి జారుకున్నారు.

Updated Date - 2023-01-10T11:29:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising