ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Velampally Srinivasa Rao: ఇంద్రకీలాద్రి అమ్మవారితో ఆటలు ఆడుకోవద్దు

ABN, First Publish Date - 2023-10-17T19:19:20+05:30

ఇంద్రకీలాద్రి అమ్మవారితో ఆటలు ఆడుకోవద్దు, అలాంటి వారికి పుట్టగతులు ఉండవని మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు (Velampally Srinivasa Rao) పేర్కొన్నారు.

విజయవాడ (ఇంద్రకీలాద్రి): ఇంద్రకీలాద్రి అమ్మవారితో ఆటలు ఆడుకోవద్దు, అలాంటి వారికి పుట్టగతులు ఉండవని మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు (Velampally Srinivasa Rao) పేర్కొన్నారు. మంగళవారం నాడు ఇంద్రకీలాద్రి కొండపై మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వెలంపల్లి మాట్లాడుతూ..‘‘ దసరా శరాన్నవ రాత్రి ఉత్సవ ఏర్పాట్లు బ్రహ్మండంగా ఉన్నాయి. కొంతమంది రాజకీయ నాయకులు ఏదో ఒకటి మాట్లాడి బురద చల్లాలని చూడడం సరికాదు. మీడియాలో మాట్లాడి చర్చ చేయడం వారికి అలవాటుగా మారింది. గత ప్రభుత్వ హయంలో రాత్రికి రాత్రే గోశాలను తొలగించారు. వినాయక గుడి పగల గొట్టారు. ఆ పార్టీ నేతలు ఇప్పుడు నీతి వ్యాఖ్యలు మాట్లాడటం శోచనీయం. గత ప్రభుత్వం కంటే ఇప్పుడు సామాన్య భక్తులకు కూడా త్వరగా దర్శనం అయ్యేలా దేవాదాయ శాఖ అధికారులు, పాలక మండలి సభ్యులు ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి జగన్మోమోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు రాబోయే రోజుల్లో దుర్గగుడి మరింత అభివృద్ధి చెందుతోంది’’ అని వెలంపల్లి శ్రీనివాసరావు అన్నారు.

Updated Date - 2023-10-17T19:34:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising