ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Vijayawada Temple: ఇంద్రకీలాద్రిపై వైదిక కమిటీ సభ్యుల మార్పు

ABN, First Publish Date - 2023-05-20T11:00:41+05:30

ఇంద్రకీలాద్రిపై వెలసిన విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో వైదిక కమిటీ సభ్యులను మారుస్తూ ఆలయ ఈవో భ్రమరాంబ నిర్ణయం తీసుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై వెలసిన విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో (Vijayawada Kanadurgamma Temple) వైదిక కమిటీ సభ్యులను మారుస్తూ ఆలయ ఈవో భ్రమరాంబ (Evo Bhramaramba) నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు శనివారం ఉదయం ఆదేశాలు జారీ చేశారు. స్థానాచార్యగా వి.శివప్రసాద్ శర్మ , వేదపండితులుగా వి.స్యావశ్య మహర్షి, యూవీఎల్‌ఎన్‌ సుబ్రమణ్య ఘనాపాటి, ప్రధాన అర్చకులుగా ఎల్‌వీఎస్ భద్రీనాథ్ బాబు, ఉపప్రధాన అర్చకులుగా బి.శంకర్ శాండిల్య, ముఖ్య అర్చకులుగా ఎం.యజ్ఞ నారాయణ శర్మ, అర్చకులుగా యూవీఎస్ మురళీధర్ శాస్త్రి, పి.వి.రఘునాధ్‌లను నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. నూతన వైదిక కమిటీ సభ్యులు.. నిత్య విధులతో పాటుగా దేవస్థానంలో జరుగే నిత్యవార్షిక, వైదిక కార్యక్రమాల్లో, అర్చక, ఆగమ శాస్త్ర ప్రకారంగా, అన్ని సేవలకు హాజరై విధులు నిర్వహించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. విధుల సమయంలో ఎవరైనా అలక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని ఈవో భ్రమరాంబ హెచ్చరించారు.

Updated Date - 2023-05-20T11:00:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising