ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Lokesh YuvaGalam: లోకేష్ యువగళం పాదయాత్రకు బ్రేక్! కారణమిదే..!

ABN, First Publish Date - 2023-05-25T14:47:16+05:30

నారా లోకేష్ యువగళం పాదయాత్ర జమ్మలమడుగులో ముగిసింది. పాదయాత్రకు నాలుగు రోజుల పాటు బ్రేక్ పడింది.

Nara Lokesh
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప: నారా లోకేష్ యువగళం పాదయాత్ర ((Nara Lokesh Yuvagalam padayatra) ) జమ్మలమడుగులో ముగిసింది. పాదయాత్రకు నాలుగు రోజుల పాటు బ్రేక్ పడింది (Four days break). ఈనెల 27, 28 తేదీల్లో రాజమండ్రిలో టీడీపీ మహానాడు జరగనుంది. ఇందుకోసం పాదయాత్రకు విరామం ప్రకటించారు. తిరిగి ఈనెల 30న జమ్మలమడుగు నుంచే పాదయాత్ర ప్రారంభించనున్నారు. ఇదిలా ఉంటే పాదయాత్ర ముగించుకుని జమ్మలమడుగు నుంచీ కడప ఎయిర్‌పోర్టుకు బయల్దేరి వెళ్లారు. ప్రత్యేక విమానంలో నారా లోకేష్ అమరావతికి చేరుకోనున్నారు. రేపు అమరావతి నుంచీ బయల్దేరి రాజమండ్రిలో జరిగే మహానాడు ప్రాంతానికి వెళ్లనున్నారు.

ఇవాళ ఇలా..

గురువారం జమ్మలమడుగు నియోజకవర్గంలోని పెద్దముడియం, పెద్దపసుపుల గ్రామాల మీదుగా లోకేష్ పాదయాత్ర కొనసాగింది. పెద్ద ఎత్తున దళితులు, మైనార్టీలు, రైతులు, మహిళలు ఘనస్వాగతం పలికారు. అడుగడుగునా ప్రజలు నీరాజనాలు పలికారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే అందరి సమస్యలు పరిష్కరిస్తానని లోకేష్ హామీ ఇచ్చారు.

Updated Date - 2023-05-25T14:51:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising