ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Eluru Dist.: వైసీపీ సర్పంచ్ గుండాగిరి దాటికి వ్యక్తి బలి..

ABN, First Publish Date - 2023-06-04T09:56:31+05:30

ఏలూరు జిల్లా: నూజివీడులో అమానుషం.. అరాచకం.. రాజ్యం మేలుతోంది. వైసీపీ సర్పంచ్ గుండాగిరి దాటికి వ్యక్తి బలయ్యాడు. చాట్రాయి మండలం, సోమవరం గ్రామంలో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు జిల్లా: నూజివీడులో అమానుషం.. అరాచకం.. రాజ్యం మేలుతోంది. వైసీపీ సర్పంచ్ (YCP Sarpanch) గుండాగిరి దాటికి వ్యక్తి బలయ్యాడు. చాట్రాయి మండలం, సోమవరం గ్రామంలో అవినీతి అక్రమాలను నిలదీసినందుకు వైసీపీ మాజీ వార్డు సభ్యురాలి భర్తను వైసీపీ సర్పంచ్ వర్గీయులు గ్రామ పెద్దల సాక్షిగా పిడి గుద్దులు గుద్ది, కాళ్ళతో తొక్కి తీవ్రంగా కొట్టారు. అక్కడితో ఆగకుండా ఈ ఘటనను వీడియో తీసి గ్రామమంతా వైరల్ చేసి గ్రామ సర్పంచ్ శోభన్ బాబు పైశాచిక ఆనందాన్ని పొందాడు.

ఈ అవమానం భరించలేక తనకు జరిగిన ఘోరాన్ని బాధితుడు కలవల శ్రీను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు పట్టించుకోకపోవడంతో తనకు పోలీస్ స్టేషన్‌లో న్యాయం జరగదని నిర్దారించుకుని, అవమాన భారాన్ని తట్టుకోలేక పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శ్రీను మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2023-06-04T09:56:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising